News February 28, 2025

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు 

image

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు. శుక్రవారం కేసముద్రం మండలం రంగాపురం గ్రామంలో మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీని కలెక్టర్ పరిశీలించి మరమ్మతులు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. జిల్లా పంచాయతీ అధికారి హరిప్రసాద్, మిషన్ భగీరథ ఈఈ లక్ష్మారెడ్డి, సిబ్బంది ఉన్నారు.

Similar News

News February 23, 2026

పుష్కరాలకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయండి: శైలజా రామయ్యర్

image

రాబోయే గోదావరి పుష్కరాలు-2027 నిర్వహణపై దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ సోమవారం సమీక్షించారు. హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆమె.. పుష్కరాల ఏర్పాట్లపై సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఘాట్లు, తాగునీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

News February 23, 2026

NRPT: ఆస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రామ్ పురోగతిపై సమీక్ష

image

నీతి ఆయోగ్ డిప్యూటీ సెక్రటరీ, అదనపు మిషన్ డైరెక్టర్ గౌరవ్ కటియార్ సోమవారం సాయంత్రం నారాయణపేట కలెక్టరేట్‌లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధ్యక్షతన నర్వ మండలంలో ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్(ABP) పురోగతిని అధికారులతో సమీక్షించారు. పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. ఆస్పిరేషనల్ బ్లాక్‌లో కొత్త మండలాలు చేర్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు.

News February 23, 2026

NRPT: ‘మహిళలపై లైంగిక వేధింపులు అరికట్టాలి’

image

పనిచేసే చోట మహిళలపై జరిగే లైంగిక వేధింపులు పూర్తిగా అరికట్టాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మహిళల రక్షణ కోసం తీసుకొచ్చిన పోష్ చట్టం అవగాహన వాల్ పోస్టర్‌ను సోమవారం నారాయణపేట కలెక్టరేట్‌లో విడుదల చేశారు. లైంగిక నిరోధక చట్టం 2013 ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యా, వ్యాపార సంస్థలు, పరిశ్రమలలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.