News February 28, 2025
అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం: నక్కా ఆనందబాబు

రాష్ట్ర బడ్జెట్లో అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత కల్పించారని మాజీ మంత్రి, వేమూరు శాసన సభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఆదాయం, అప్పులు బేరీజు వేసుకుంటూ ప్రాధాన్యత క్రమంలో పథకాల అమలుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. విద్యార్థుల చదువులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ తల్లికి వందనం పథకం అమలుకు బడ్జెట్లో రూ.9,407 కోట్లు నిధులు కేటాయించడం శుభ పరిణామం అన్నారు.
Similar News
News March 1, 2025
MNCL: రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలివాడ సమీపంలో రైలు కింద పడి శుక్రవారం ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని మందమర్రి పట్టణంలోని రామన్ కాలనీకి చెందిన నస్పూరి వినయ్గా గుర్తించారు. మృతుడు ప్రైవేట్ డ్రైవర్గా జీవనం సాగిస్తుండగా.. భార్యా భర్తల మధ్య గొడవల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. ఈ మేరకు జీఆర్పీ ఎస్ఐ ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుల్ జస్పాల్ సింగ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News March 1, 2025
NZB: ఆన్లైన్లో ఇంటర్ హాల్ టికెట్లు

ఇంటర్ విద్యార్థుల హాల్ టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచామని DIEO రవికుమార్ తెలిపారు. ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపల్లు హాల్ టికెట్లు ఇవ్వకపోతే విద్యార్థులు ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లతో పరీక్ష కేంద్రంలోకి వెళ్లవచ్చునని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయకుండా వెంటనే హాల్ టికెట్లు అందరికీ ఇవ్వాలని ప్రైవేటు, ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్లను ఆదేశించారు.
News March 1, 2025
NZB: జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య

నిజామాబాద్ వన్ టౌన్ పరిధిలోని ఓ వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు SHO రఘుపతి శుక్రవారం తెలిపారు. పూసల గల్లీకి చెందిన బద్దూరి లక్ష్మణ్ (41) గత కొన్ని సంవత్సరాలుగా కాళ్లకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుమందు తాగాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మృత దేహాన్ని మార్చరికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.