News March 22, 2024
పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ నేపథ్యం..

మాజీ ఎంపీ గడ్డం వెంకటస్వామి(కాక) మనవడు వంశీకృష్ణ. వంశీకి భార్య రోష్ని, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈయన 2010లో అమెరికాలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ పట్టా పొందారు. కాకా కుటుంబంలోని 3వ తరానికి చెందిన వంశీకృష్ణ విశాఖ ట్రస్టు ద్వారా పలు సేవలు చేస్తున్నారు. తండ్రి వివేక్ చెన్నూరు ఎమ్మెల్యేగా, పెదనాన్న వినోద్ బెల్లంపల్లి ఎఎమ్మెల్యేగా ఉండగా కొడుకు వంశీ పెద్దపల్లి ఎంపీ బరిలో నిలిచారు.
Similar News
News October 23, 2025
కరీంనగర్: విద్యార్థులకు వ్యాసరచన పోటీలు: సీపీ

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా విద్యార్థుల కోసం వివిధ పోటీలు నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ సిపి గౌష్ ఆలం తెలిపారు. ‘ఆన్ లైన్ ద్వారా డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర’, ‘విద్యార్థులు డ్రగ్స్ నుంచి ఎలా దూరంగా ఉండాలి’ అనే అంశాలపై తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషలలో ఉంటాయన్నారు. https://forms.gle/jaWLdt2yhNrMpe3eA ఈ లింకులో ఈనెల 28 వరకు అప్లోడ్ చేయాలన్నారు. ముగ్గురిని విజేతలుగా ప్రకటిస్తామన్నారు.
News October 23, 2025
కరీంనగర్ డీసీసీ అధ్యక్ష పదవి.. ఆ ఇద్దరి మధ్యే పోటీ

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కోసం ఇద్దరు కీలక నేతల మధ్య తీవ్ర పోటాపోటీ నెలకొంది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి, గతంలో KNR పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి ఓడిపోయిన వెలిచాల రాజేందర్ రావు ఈ పదవి కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. DCC అధ్యక్ష పదవి కోసం మొత్తం 36 మంది ఆశావాహులు నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
News October 23, 2025
చొప్పదండి పట్టణ అభివృద్ధికి రూ.15 కోట్లు మంజూరు

చొప్పదండి పట్టణ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 15 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విజ్ఞప్తి మేరకు సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఈ నిధులు మంజూరు చేశారని ఆయన పేర్కొన్నారు. ఇందుకు చొప్పదండి పట్టణ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ నిధులతో చొప్పదండి మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.