News February 28, 2025
రాజమండ్రి: ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు- ఎస్పీ

రేపటి నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసిన్నట్లు జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ వెల్లడించారు. శుక్రవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు.
Similar News
News May 8, 2025
తూ.గో: అవార్డు అందుకున్న కలెక్టర్

ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్ భవన్లో జరిగిన కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆంధ్రపదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతులు మీదుగా ప్రశంపా పత్రం స్వీకరించారు. 2022-23 సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా పనిచేసిన సమయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యకలాపాలు విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించడం కోసం చేసిన కృషిని గుర్తింపు లభించింది.
News May 7, 2025
రాజానగరం: ఏపీ పాలిసెట్ ప్రవేశ పరీక్షకు కేంద్రాలు ఏర్పాటు

పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రభుత్వం నిర్వహించే ఏపీ పాలిసెట్ 2025 ప్రవేశ పరీక్షకు గైట్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో రెండు పరీక్షా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.రామానుజం, వైస్ ప్రిన్సిపల్ టి.రామారావు తెలిపారు. శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. GIET కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో మొత్తం 1,791 మంది పరీక్ష రాయనున్నట్టు పేర్కొన్నారు.
News May 7, 2025
దేవరపల్లి: తల్లిదండ్రులకు నెలకు 5,000 చెల్లించండి

తల్లితండ్రులను వృద్ధాప్య దశలో చూడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కలెక్టర్ ప్రశాంతి మండిపడ్డారు. శనివారం దేవరపల్లి మండలం యాదవోలుకు చెందిన కోలా వరలక్ష్మి, కృష్ణమూర్తి వయోవృద్ధుల పోషణ సంక్షేమ ట్రిబ్యునల్లో నమోదు అయ్యింది. కలెక్టర్ ఛాంబర్లో ఆర్డీవో రాణి సుస్మిత, ఫిర్యాదుదారుడి సమక్షంలో కోర్టు నిర్వహించారు. కుటుంబంలో ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులకు ప్రతి నెల ఐదు వేలు చెల్లించాలని ఆదేశించారు.