News February 28, 2025
ఉగ్రవాదిని అనుకుని గన్తో కాల్చబోయారు: సునీల్ శెట్టి

వరల్డ్ ట్రేడ్ సెంటర్పై దాడి జరిగిన కొన్ని రోజులకు తనకు USలో భయానక పరిస్థితి ఎదురైనట్లు సునీల్ శెట్టి వెల్లడించారు. ‘2001లో నేను కాంటే మూవీ షూటింగ్ తర్వాత LAలోని హోటల్కు వెళ్తుండగా నా లుక్ను చూసి టెర్రరిస్టు అని అనుమానించారు. కిందికి రాకపోతే కాల్చేస్తామని పోలీసులు హెచ్చరించారు. మోకాళ్లపై కూర్చోబెట్టి సంకెళ్లు వేశారు. హోటల్ మేనేజర్ నేనెవరో చెప్పడంతో వదిలేశారు’ అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
Similar News
News March 1, 2025
వచ్చే ఐదేళ్లలో నాలుగు కుంభమేళాలు

ఇటీవల ముగిసిన మహా కుంభమేళా మళ్లీ 144 ఏళ్లకు రానుండగా వచ్చే ఐదేళ్లలో 4 కుంభమేళాలు జరగనున్నాయి. 2027లో హరిద్వార్లో అర్ధ కుంభమేళా ఉంటుంది. అదే ఏడాది జులై 17 నుంచి ఆగస్టు 17 వరకు మహారాష్ట్రలోని నాసిక్కు 40 కి.మీ దూరంలో ఉండే త్రయంబకేశ్వర్లో మరో కుంభమేళా నిర్వహిస్తారు. ఇక్కడి కొండల్లోనే గోదావరి నది పుట్టింది. 2028లో ఉజ్జయిని, 2030లో ప్రయాగ్రాజ్ కుంభమేళాలు జరుగుతాయి.
News March 1, 2025
ఇంకా నయం జెలెన్స్కీని ట్రంప్ కొట్టలేదు: రష్యా

ట్రంప్, జెలెన్స్కీ వాగ్వాదంపై రష్యా స్పందించింది. ఇంతటి గొడవలో జెలెన్స్కీని ‘కొట్టకుండా’ ట్రంప్ చాలా సంయమనం పాటించారని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా అన్నారు. మీటింగ్లో ఆయన అన్నీ అబద్ధాలే మాట్లాడారని ఆరోపించారు. ఇక వైట్హౌస్లో జరిగిన ఘటన జెలెన్స్కీకి చెంపదెబ్బ లాంటిదని రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వెదేవ్ పేర్కొన్నారు. ఆయనను ‘అవమానం జరిగిన పంది’గా అభివర్ణించారు.
News March 1, 2025
సజ్జల డైరెక్షన్లోనే పవన్, లోకేశ్ను తిట్టా.. పోసాని రిమాండ్ రిపోర్ట్

AP: నటుడు పోసాని రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు పొందుపర్చారు. YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్ మేరకే పవన్, లోకేశ్ కుటుంబ సభ్యులను దూషించానని పోసాని చెప్పినట్లు పేర్కొన్నారు. తాను మాట్లాడిన మాటలను సజ్జల కుమారుడు భార్గవ్ SMలో వైరల్ చేసేవాడని తెలిపారు. సజ్జల అనుమతితోనే HYDలో ప్రెస్మీట్ నిర్వహించి పవన్ను వ్యక్తిగతంగా తిట్టినట్లు పోసాని అంగీకరించారని వెల్లడించారు.