News March 1, 2025
10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

జిల్లాలో మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరగనున్న 10వ తరగతి వార్షీక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శుక్రవారం ASF కలెక్టర్ సమావేశ మందిరంలో ఇన్చార్జి జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్యతో కలిసి పోలీస్, రెవెన్యూ, విద్యా, గిరిజన, షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీ, రవాణా, వైద్య ఆరోగ్య అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Similar News
News January 12, 2026
ప్రీ అప్రూవ్డ్ లోన్ ఎవరికిస్తారో తెలుసా?

ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ అనేది బ్యాంకులు ముందుగానే అర్హత నిర్ధారించి ఎంపిక చేసిన కస్టమర్లకు ఇస్తాయి. ఆదాయం, సిబిల్ స్కోర్, లావాదేవీల ఆధారంగా లోన్ మొత్తాన్ని ఫిక్స్ చేస్తాయి. సాధారణంగా మంచి క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి SMS లేదా ఈమెయిల్ పంపిస్తాయి. తక్కువ డాక్యుమెంట్స్తో లోన్ మంజూరు చేస్తాయి. అయితే అధిక వడ్డీ ఉండే అవకాశం ఉంది. దీంతో అవసరం ఉన్నప్పుడే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
News January 12, 2026
చివరి 2 వన్డేలకు సుందర్ ఔట్?

టీమ్ ఇండియాకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వడోదరలో న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయపడ్డారు. కివీస్ ఇన్నింగ్స్లో 20వ ఓవర్ వేస్తున్న సమయంలో గాయపడటంతో వెంటనే మైదానాన్ని వీడాల్సి వచ్చింది. మళ్లీ ఫీల్డింగ్కు రాలేదు. అనంతరం బ్యాటింగ్కు వచ్చినా ఇబ్బంది పడుతూ కనిపించారు. దీంతో చివరి 2 ODIలు ఆడకపోవచ్చని సమాచారం. దీనిపై BCCI నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
News January 12, 2026
సోమవారం ఉపవాసం ఉంటున్నారా?

సోమవారం ఉపవాసం ఉంటే మానసిక ప్రశాంతత, స్వీయ నియంత్రణ లభిస్తాయి. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి పార్వతీదేవి కూడా ఈ ఉపవాసాన్ని ఆచరించిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున భక్తులు శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. అనంతరం మారేడు దళాలు, తుమ్మి పూలతో పూజించి ‘ఓం నమః శివాయ’ మంత్రాన్ని జపించాలి. రోజంతా భక్తితో గడిపి, సాయంత్రం సాత్విక ఆహారం తీసుకుంటే కోరికలు నెరవేరి, జీవితంలో సుఖశాంతులు చేకూరుతాయి.


