News March 1, 2025
అన్నమయ్య: ‘నాటు సారా నిర్మూలనకు కృషి చేయాలి’

అన్నమయ్య జిల్లా చినమడియం మండలంలోని గిరిజన ప్రాంతాల్లో నాటుసారా నిర్మూలనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని ఎక్చేంజ్ ఎస్పీ మధుసూధన్ పేర్కొన్నారు. శుక్రవారం ముసలికుంట రెవెన్యూ గ్రామ పరిధిలోని బండక్రింద తాండాలో నాటుసారా నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్చేంజ్ ఎస్పీ మధుసూధన్ మాట్లడుతూ.. ప్రభుత్వం గిరిజనులకు ఉపాధి కల్పించి, అన్నివిధాల ఆదుకుంటుదని హామీ ఇచ్చారు.
Similar News
News December 28, 2025
ఈనెల 30న ఉమ్మడి పాలమూరు జిల్లా హాకీ జట్టు ఎంపికలు

పాలమూరు విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ, పీజీ కళాశాలల పురుషుల హాకీ జట్టు ఎంపికలు ఈనెల 30న వనపర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించనున్నట్లు పీడీ శ్రీనివాసులు తెలిపారు. 17-25 ఏళ్ల లోపు వారు అర్హులని, ప్రిన్సిపల్ ధ్రువీకరించిన బోనఫైడ్ పత్రాలతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని కోరారు.
News December 28, 2025
అల్లూరి జిల్లాలో విషాదం.. తండ్రీకొడుకుల మృతి

అల్లూరి జిల్లా కూనవరం మండలం నర్సింగపేటలో ఆదివారం ప్రమాదం జరిగింది. కోడిపుంజుతో ఈత కొట్టించే ప్రయత్నంలో తండ్రీకొడుకులు సింహాద్రి అప్పారావు (42), జస్వంత్ (14) వ్యవసాయ నీటి గుంతలో పడి మృతి చెందారు. ఆశ్రమ పాఠశాల సమీపంలో జరిగిన ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
News December 28, 2025
యాదాద్రి: అపూర్వం.. 26 ఏళ్ల జ్ఞాపకాల పందిరి

అడ్డగూడూరు మండలం కోటమర్తి ZPHS.. ఆదివారం అపురూప వేడుకకు వేదికైంది. 1998-99లో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు 26 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒకేచోట చేరి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని, బాల్య జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను వేదికపైకి ఆహ్వానించి, శాలువాలతో సత్కరించి, పాదాభివందనం చేసి కృతజ్ఞతలు తెలిపారు.


