News March 1, 2025

GWL: పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరపాలి: కలెక్టర్

image

పదవ తరగతి పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని గద్వాల జిల్లా కలెక్టర్ బియం.సంతోష్ అధికారులకు ఆదేశించారు. ఐడిఓసి కాన్ఫరెన్స్ హాల్ నందు పదవ తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతంగా ఎగ్జామ్ రాసే లాగా చేయాలని అన్నారు.

Similar News

News November 17, 2025

భద్రాద్రి డీసీసీ.. భట్టి VS పొంగులేటి అనుచరులు

image

భద్రాద్రి డీసీసీ అధ్యక్షుడి ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వర్గాలకు చెందిన నేతలు ప్రధానంగా పోటీలో ఉన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు పొదెం వీరయ్య సహా మోత్కూరి ధర్మారావు, నాగ సీతారాములు, కొత్వాల శ్రీనివాస్, తదితర నేతలు పీఠాన్ని దక్కించుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఏఐసీసీ పరిశీలకుడు ఇప్పటికే అభిప్రాయాలు సేకరించారు. ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి.

News November 17, 2025

కొత్తగూడెంలో జాబ్ మేళా.. 2915 మందికి ఉద్యోగాలు

image

కొత్తగూడెం క్లబ్‌లో ఆదివారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు 8500 మంది నిరుద్యోగులు హాజరయ్యారు. కాగా 2915 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. 65 కంపెనీలకు పైగా ఈ జాబ్ మేళాకు హాజరై నిరుద్యోగ అభ్యర్థుల దరఖాస్తులను స్వీకరించి ఇంటర్వ్యూ నిర్వహించారు. అర్హత సాధించిన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కూనంనేని, సీఎండీ బలరాం, కలెక్టర్, ఎస్పీ పాల్గొన్నారు.

News November 17, 2025

తెనాలి: విషాద ఘటనలు.. ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

image

తెనాలి నియోజకవర్గంలో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. తెనాలి నాజరుపేటకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి పవన్ తేజ (24) ఆలస్యంగా ఇంటికి రావడంతో తల్లి మందలించగా మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో ఘటనలో కొల్లిపర మండలం జముడుబాడుపాలెంకి చెందిన విద్యార్థిని లావణ్య (20) అనారోగ్య సమస్యలతో ఆదివారం ఉరి వేసుకొని చనిపోయింది. ఈ రెండు ఘటనలపై వన్‌టౌన్, కొల్లిపర పోలీసులు కేసులు నమోదు చేశారు.