News March 1, 2025
WPL: టేబుల్ టాప్లో ఢిల్లీ

ముంబైతో జరిగిన మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 123 పరుగులు చేసింది. ఛేదనలో ఢిల్లీ బ్యాటర్లు రెచ్చిపోయారు. కెప్టెన్ లానింగ్(60*) అర్ధసెంచరీ చేయగా షఫాలీ 28 బంతుల్లో 43 రన్స్ చేశారు. 10వ ఓవర్లో షఫాలీ ఔటైనా రోడ్రిగ్స్తో కలిసి కెప్టెన్ జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో 8 పాయింట్లతో ఢిల్లీ తొలి స్థానానికి చేరింది.
Similar News
News March 1, 2025
శ్రీకాళహస్తిలో శివపార్వతుల కళ్యాణోత్సవం

AP: శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ తెల్లవారుజామున జ్ఞానప్రసూనాంబ సమేత వాయు లింగేశ్వరుడి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వామి, అమ్మవార్లను ఆలయ అలంకార మండపంలో సుందరంగా అలంకరించి పెళ్లి మండపం వద్దకు తీసుకొచ్చారు. ఇదే కళ్యాణ ఘడియలో వందకు పైగా జంటలు మనువాడాయి. వీరికి దేవస్థానం ఆధ్వర్యంలో తాళిబొట్లు, ఇతర పెళ్లి సామగ్రి ఉచితంగా అందించారు.
News March 1, 2025
శివకుమార్ పార్టీని చీలుస్తారు: బీజేపీ నేత

కర్ణాటక కాంగ్రెస్లో చీలికలు వచ్చేఅవకాశముందని ప్రతిపక్ష బీజేపీ నేత అశోక ఆరోపించారు. ఏక్నాథ్ శిందే తరహాలో ఆ పార్టీని ఉపముఖ్యమంత్రి డి.కే శివకుమార్ బీజేపీలో విలీనం చేసే అవకాశముందని తెలిపారు. నవంబర్16న కాంగ్రెస్లో నాయకత్వ మార్పు జరగనుందని జోస్యం చెప్పారు. అయితే శివరాత్రి వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్షాతో పాటు డి.కే శివకుమార్ పాల్గొనటంతో పుకార్లు రేగాయి. ఉప ముఖ్యమంత్రి దీన్ని ఖండించారు.
News March 1, 2025
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తులను నేరుగా క్యూలైన్లలోకి పంపుతుండటంతో, ఉ.7గంటల వరకు కంపార్ట్మెంట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఉ.8 గంటలకు బ్రేక్ దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఇకపై భక్తులను కంపార్ట్మెంట్లలోకి పంపనున్నారు. వారు శ్రీవారిని దర్శించుకోవడానికి దాదాపు 8గంటల సమయం పట్టే అవకాశం ఉంది. నిన్న 52,731 మంది దర్శించుకోగా 17,664 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.24 కోట్లు వచ్చింది.