News March 1, 2025

భద్రాద్రి: ఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు

image

కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ ఎదుట ఇద్దరు మావోయిస్టులు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసి గుర్రాల విజయ్ కుమార్ (36), ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌కి చెందిన సోడి బాలకృష్ణలు శుక్రవారం లొంగిపోయారు. విజయ్.. హిడ్మా నాయకత్వంలోని CPI Maoist PLGA 1st బెటాలియన్‌లో 2022లో పార్టీ మెంబర్‌గా చేరారు. సోడి బాలకృష్ణ 2018లో చర్ల ఏరియా కమిటీ మలేషియా మెంబర్‌గా అరుణ్ DVC ఆధ్వర్యంలో చేరారు.

Similar News

News March 1, 2025

NZB: జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ముగ్గురి మృతి

image

నిజామాబాద్ జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. NZB రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్‌లో చండీ కృష్ణ (37) అనే వ్యవసాయ కూలీ ఫిట్స్‌తో మృతి చెందాడు. అలాగే రుద్రూర్ మండల కేంద్రంలో కాదారి సాయినాథ్ (38) అనే రైతు పొలం గట్టుపై నడుచుకుంటూ వెళ్తూ బురదలో పడి మృతి చెందాడు. అదేవిధంగా నగరంలోని పూసలగల్లీలో బద్దురి లక్ష్మణ్ (41) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

News March 1, 2025

ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసులో అరెస్టు!

image

AP: పోసాని కృష్ణమురళికి మరో షాక్ ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ఒక కేసులో అరెస్టై, 14 రోజుల రిమాండ్‌లో ఉన్నారు. దీనిపై ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సోమవారం కోర్టులో విచారణ జరగనుంది. అయితే పోసానిపై రాష్ట్రవ్యాప్తంగా 14 కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో బెయిల్ దొరికితే మరో కేసులో అరెస్టు చేయడానికి పోలీసులు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

News March 1, 2025

రంజాన్ మాసం ప్రారంభం అవుతున్న వేళ.. రోడ్లపై గస్తీ పెంచండి: సీపీ

image

రేపటి నుంచి రంజాన్ పవిత్ర మాసం ప్రారంభమవుతున్న వేళ పోలీసులు వారి వారి పోలీస్ స్టేషన్ల పరిధిలో పెట్రోలింగ్ చేసే సమయాన్ని పెంచుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులను అదేశించారు. ప్రధానంగా విజుబుల్ పోలిసింగ్‌లో భాగంగా పోలీసులు నిరంతరం గస్తీ నిర్వహించాలన్నారు. ఫిర్యాదుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ తక్షణమే స్టేషన్ అధికారులు స్పందించడంతో పాటు ఘటనా స్థలానికి చేరుకోవాలని సూచించారు.

error: Content is protected !!