News March 1, 2025
HYD: మార్చి 1.. పెరిగిన టికెట్ ధరలు

HYD బహదూర్పురాలోని నెహ్రూ జూపార్క్ ఎంట్రీ టికెట్ ధర పెరిగింది. Adults రూ. 100, Children రూ. రూ. 50 చొప్పున టికెట్ ధరలు నిర్ణయించారు. సఫారీ, ట్రెయిన్ రైడ్, ఫిష్ అక్వేరియం ఎంట్రీ టికెట్ ధరలు కూడా పెరిగాయి. సమ్మర్లో టూరిస్టులు అధికంగా జూ పార్క్కు వస్తుంటారు. అనుగుణంగా అధికారులు పార్క్లో ఏర్పాట్లు చేస్తున్నారు.https://nzptsfd.telangana.gov.in వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
SHARE IT
Similar News
News January 14, 2026
HYD: డస్ట్ బిన్లే ఆఫీస్కు కాల్ చేస్తాయి!

రోడ్డు మీద డస్ట్బిన్లు నిండిపోయి వాసన వస్తున్నాయా? ఫ్యూచర్ సిటీలో ఆ ఛాన్స్ లేదు. ముచ్చర్లలో రాబోతున్న ఈ పారిశుద్ధ్య వ్యవస్థ ఇండియాలోనే అతిపెద్ద ‘జీరో-హ్యూమన్ ఇంటర్వెన్షన్’ ప్రాజెక్ట్. ప్రతి బిన్కు అమర్చే ‘సెన్సార్లు’ చెత్త 80% నిండగానే కమాండ్ సెంటర్కు సిగ్నల్ పంపిస్తాయి. డ్రైవర్ లేని ‘ఎలక్ట్రిక్ వ్యాన్లు’ ఎప్పటికప్పుడు ఆ బిన్ను ఖాళీ చేస్తాయి. దావోస్లో CM చూపించబోయే ‘క్లీన్’ సిటీ సీక్రెట్ ఇదే.
News January 14, 2026
HYD: ఆకాశంలో తెగిపోని అనుబంధం!

పతంగి.. ఇది కాగితం ముక్క కాదు. నాన్న నేర్పిన మొదటి గెలుపు పాఠం. మాంజాకు వేళ్లు తెగుతున్నా లెక్కచేయకుండా పతంగిని తండ్రి గాల్లోకి విసిరే ఆ క్షణం ఒక అపురూపమైన దృశ్యం. ‘కింద పడినా మళ్లీ ఎగరాలి’ అని నేర్పే గాలిపటం స్ఫూర్తి గొప్పది. పొరిగింటి వాడి పతంగిని కట్ చేసినప్పుడు వచ్చే ఆ కేకల్లో చిన్ననాటి జ్ఞాపకాలు దాగున్నాయి. ఫోన్లకు దూరంగా కాటే నినాదాల నడుమ ఆకాశంలో తెగిపోని బంధంలా హైదరాబాదీలకు పతంగి మారింది.
News January 14, 2026
ఫ్యూచర్ సిటీలో ‘బ్లాక్ చైన్’ సిస్టం

భూమి మీది.. కానీ రికార్డుల్లో ఇంకొకరిది. ఫ్యూచర్ సిటీలో ఇలాంటి మాయాజాలం చెల్లదు. ఇక్కడ ప్రతి అంగుళం ‘బ్లాక్ చైన్’ భద్రతలో ఉంటుంది. ప్రభుత్వం “హైడ్రా-లెడ్జర్” వ్యవస్థను డిజైన్ చేసింది. సాధారణంగా రెవెన్యూ రికార్డులు ట్యాంపర్ చేయొచ్చు.. కానీ ఇక్కడ ‘బ్లాక్ చైన్’ వాడటం వల్ల ఒక్కసారి ఎంట్రీ పడితే ఎవరూ మార్చలేరు. ‘డిజిటల్ లాకర్’ వ్యవస్థను సిద్ధం చేస్తున్నారని అధికారులు Way2Newsకు వివరించారు.


