News March 1, 2025
కొత్త ఏడాదిలో 2 నెలలు కంప్లీట్.. మరి?

2025లో అడుగుపెట్టి 2 నెలలు గడిచిపోయాయి. ఇన్ని రోజులూ అనుకున్నది చేయలేకపోయినా JAN 1 నుంచి మొదలుపెట్టాలని గతేడాది చివర్లో ప్లాన్ వేసుకొని ఉంటాం. బుక్స్ చదవాలనో, ఆర్థిక క్రమశిక్షణ పాటించాలనో, జిమ్కు వెళ్లాలనో, ఇతరత్రా రిజల్యూషన్స్ తీసుకుంటాం. వాటిని స్టార్ చేసి వదిలేసిన వారు, కొనసాగిస్తున్న వారు, అసలు మొదలెట్టని వారూ ఉంటారు. మరి మీ రిజల్యూషన్స్ ఎక్కడి వరకు వచ్చాయో COMMENT చేయండి.
Similar News
News March 1, 2025
ఫస్ట్ షోరూమ్ను టెస్లా ఎక్కడ ఓపెన్ చేస్తోందంటే..

భారత్కు టెస్లా మరింత చేరువైంది. ముంబై బాంద్రాకుర్లా కాంప్లెక్స్లో షోరూమ్ కోసం ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిసింది. ఓ కమర్షియల్ కాంప్లెక్సులోని అండర్గ్రౌండులో 4000 sft స్పేస్ను ఐదేళ్లు లీజుకు తీసుకుంది. ఒక sftకి రూ.900 చొప్పున నెలకు ₹35లక్షల రెంటు చెల్లించనుంది. రెండో షోరూమ్ను ఢిల్లీలోని ఏరోసిటీ కాంప్లెక్స్లో ఆరంభిస్తుందని సమాచారం. టెస్లా ఇప్పటికే ఉద్యోగుల హైరింగ్ ప్రాసెస్ చేపట్టడం గమనార్హం.
News March 1, 2025
అలాగైతే.. TDP వాళ్లంతా జైల్లో ఉండేవారు: అమర్నాథ్

AP: అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసానిని అరెస్ట్ చేసినట్లు TDP చెబుతోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. YCP అధికారంలో ఉన్నప్పుడు TDP వారు తమపై చేసిన వ్యాఖ్యలను పట్టించుకొని ఉంటే, వాళ్లంతా జైల్లో ఉండేవారని చెప్పారు. కేసులకు భయపడి వైసీపీ నేతలు ఇంట్లో కూర్చునే పరిస్థితి లేదన్నారు. ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు కక్ష సాధింపులపై కాకుండా పరిపాలన మీద, హామీల అమలుపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.
News March 1, 2025
మీ జీతం కూడా ఇండియా వల్లే: సునీల్ గవాస్కర్

దుబాయ్లో ఆడటం భారత్కు కలిసివచ్చిందన్న ఇంగ్లండ్ మాజీల వ్యాఖ్యలను సునీల్ గవస్కర్ తిప్పికొట్టారు. ఓటమి అక్కసు తమ టీమ్పై చూపకూడదన్నారు. భద్రతాలోపాలతోనే దుబాయ్లో ఆడుతున్నట్లు బీసీసీఐ ముందే ప్రకటించిందన్నారు. ఐసీసీకి భారత్ ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తోందని, మీడియా హక్కుల ద్వారా ఆదాయం వస్తుందని చెప్పారు. వారికొచ్చే జీతం కూడా పరోక్షంగా(నాజర్ హుస్సేన్, మైక్ అథర్టన్) భారత్ ద్వారానే అందుతుందన్నారు.