News March 1, 2025
డుంబ్రిగూడలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

డుంబ్రిగూడ మండలం నారింజవలస సమీపంలో శుక్రవారం రోడ్డు <<15611939>>ప్రమాదం<<>> జరిగిన విషయం తెలిసిందే. విశాఖకు చెందిన రామ్మోహన్, సోమనాథ్ పాడేరు నుంచి అరకులోయ వైపు వస్తుండగా స్కూటీ డివైడర్ని ఢీకొట్టింది. ఈఘటనలో సోమనాథ్ మరణించగా రామ్మోహన్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు క్షతగాత్రుడిని అంబులెన్స్లో అరకు ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Similar News
News March 1, 2026
ఇవాళ్టి నుంచి దివ్యాంగులకు బస్సుల్లో ఫ్రీ జర్నీ

దివ్యాంగుల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం ‘ఇంద్రధనస్సు’ పథకం కింద ఇవాళ్టి నుంచి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించింది. మహిళలకు అమలు చేస్తున్న ‘స్త్రీ శక్తి’ తరహాలోనే 40%, అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ సహా 5 రకాల RTC బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించవచ్చు. సదరం సర్టిఫికెట్ లేదా స్మార్ట్ కార్డ్ చూపించి జీరో టికెట్ పొందొచ్చు. ఇతర బస్సుల్లో పాత పద్ధతిలోనే 50% రాయితీ ఉంటుంది.
News March 1, 2026
ఇరాన్ బెదిరింపులు.. ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

అమెరికాపై ప్రతీకార <<19268566>>దాడి<<>> చేస్తామన్న ఇరాన్ బెదిరింపులపై ప్రెసిడెంట్ ట్రంప్ స్పందించారు. ‘ఇవాళ భీకర దాడి చేస్తామని ఇరాన్ బెదిరించింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అటాక్ చేస్తామంది. ఇరాన్ ఆ పని చేయకుండా ఉంటే మంచిది. ఒకవేళ ఆ పని చేస్తే మేం చేసే దాడి మామూలుగా ఉండదు. గతంలో ఎన్నడూ చూడని విధంగా మా బలగాలను రంగంలోకి దించాల్సి వస్తుంది’ అని వార్నింగ్ ఇచ్చారు.
News March 1, 2026
రేపు HYDకి రాహుల్ గాంధీ

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రేపు HYDకు రానున్నారు. ఇక్కడి నుంచి వికారాబాద్ జిల్లా అనంతగిరిలో జరుగుతున్న DCCల శిక్షణ కార్యక్రమంలో వారితో మాట్లాడనున్నారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు రాహుల్ పర్యటన దృష్ట్యా కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. పర్యటనంతా పటిష్ఠమైన భద్రతా చర్యల నడుమ చేపట్టాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది.


