News March 1, 2025
కాకినాడ : ఒక్క నిమిషం.. వారి కోసం.!

కాకినాడ జిల్లాలో 56 కేంద్రాల్లో 44,531 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. విద్యార్థులను ఉదయం గం.8.30 ని.ల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఉదయం 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని అధికార యంత్రాంగం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు పరీక్షా కేంద్రాలకు వెళ్లేటప్పుడు ట్రాఫిక్ జామ్ లేదా ప్రయాణానికి సౌకర్యం లేని వారికి కాస్త మనవంతు సాయం చేద్దాం.
Similar News
News October 31, 2025
భారీ వర్షంలో వేగంగా విద్యుత్ పునరుద్ధరణ పనులు: సీఎండీ

మొంథా తుపాను కారణంగా నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పరిధిలో దాదాపు రూ.10 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి తెలిపారు. ముందస్తు జాగ్రత్తలతో భారీ వర్షంలోనూ రేయింబవళ్లు పనిచేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని చెప్పారు. నీట మునిగిన 249 ట్రాన్స్ఫార్మర్లలో 246 ట్రాన్స్ఫార్మర్లను ఇప్పటివరకు సరిచేశామని స్పష్టం చేశారు.
News October 31, 2025
ప్రకాశం బ్యారేజ్లోకి 4.38L క్యూసెక్కుల వరద

AP: ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజ్లోకి 4.38 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతోంది. దీంతో అధికారులు ముందుజాగ్రత్తగా 69 గేట్ల ద్వారా సముద్రంలోకి జలాలను విడుదల చేస్తున్నారు. కృష్ణా నది తీర ప్రాంతాల్లో చేపల వేటను నిషేధించారు. బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 12.9 అడుగుల నీటి మట్టం ఉండగా, మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కాగా మొంథా తుఫాను ధాటికి చెరువులు, నదులు, ప్రాజెక్టులు నిండుకుండల్లా ఉన్నాయి.
News October 31, 2025
KNL: మైనారిటీ యువతకు ఉచిత శిక్షణ

కర్నూలు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైనారిటీ యువతకు ఉచిత ఉద్యోగ శిక్షణ అందిస్తున్నట్లు ఆ శాఖ అధికారి సబీహా పర్వీన్ తెలిపారు. ఎస్ఐ, కానిస్టేబుల్, టెట్, డీఎస్సీ వంటి పోటీ పరీక్షల కోసం సీఈడీఎం ద్వారా ఈ శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గలవారు https://apcedmmwd.org ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. వివరాల కోసం కార్యాలయంలో సంప్రదించాలని తెలియజేశారు.


