News March 1, 2025
కాకినాడ : ఒక్క నిమిషం.. వారి కోసం.!

కాకినాడ జిల్లాలో 56 కేంద్రాల్లో 44,531 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. విద్యార్థులను ఉదయం గం.8.30 ని.ల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఉదయం 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని అధికార యంత్రాంగం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు పరీక్షా కేంద్రాలకు వెళ్లేటప్పుడు ట్రాఫిక్ జామ్ లేదా ప్రయాణానికి సౌకర్యం లేని వారికి కాస్త మనవంతు సాయం చేద్దాం.
Similar News
News January 9, 2026
మహిళలూ.. ఈ లక్షణాలున్నాయా? జాగ్రత్త

క్యాన్సర్ లక్షణాలు అన్నిసార్లూ బయటకు కనిపించవు. ముఖ్యంగా మహిళల్లో కొన్ని క్యాన్సర్లు నిశ్శబ్ధంగా శరీరంలో వ్యాపిస్తాయంటున్నారు నిపుణులు. చాలా క్యాన్సర్లను ప్రారంభదశలో గుర్తించడం కష్టమని చెబుతున్నారు. అందుకే మహిళల్లో అసాధారణ వాపు, దీర్ఘకాల అలసట, కారణం లేకుండా బరువు తగ్గడం, చర్మంపై మార్పులు, అసాధారణ రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
News January 9, 2026
AIIMS పట్నాలో 117 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

AIIMS పట్నాలో 117 సీనియర్ రెసిడెంట్(నాన్ అకడమిక్) పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి MBBS/MD/MS/DNB/DM/M.Ch ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://api.aiimspatna.edu.in/
News January 9, 2026
మేడారం భక్తుల కానుకలు.. భద్రమేనా..!?

మేడారం జాతరలో హుండీలో భక్తుల కానుకలకు ఈసారైనా దేవదాయ శాఖ అధికారులు భద్రత కల్పిస్తారా? అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. గత మేడారం జాతరలో అనుకోకుండా కురిసిన భారీ వర్షానికి జాతరలో ఏర్పాటు చేసిన హుండీలకు వర్షపు నీరు చేరి భక్తులు వేసిన బియ్యం, నోట్ల కాగితాలు, ఇతర కానుకలు తడిసి ముద్దయ్యాయి. లక్షల రూపాయలు బూజు పట్టి పనికిరాకుండా పోయాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారైనా అధికారులు చర్యలు తీసుకోవాలి.


