News March 1, 2025
వేర్వేరు ఘటనల్లో ముగ్గురి ఆత్మహత్య

MBNR, WNP, NGKL జిల్లాల్లో శుక్రవారం వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల వివరాలిలా.. జడ్చర్లకు చెందిన వడ్డె సంజీవ(30) అప్పులు తీర్చలేక ఉరేసుకున్నాడు. గోపాల్పేటకు చెందిన కొంకలి మల్లయ్య(40) కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. NGKL జిల్లా పెనిమిళ్లకి చెందిన మేర కృష్ణయ్య సోదరి దగ్గర ఉంటుండగా, కడుపునొప్పి భరించలేక పొలం వద్ద ఉరేసుకున్నాడు.
Similar News
News January 12, 2026
HYD: హాస్టళ్లలో నో ఫుడ్!

సంక్రాంతి సెలవులు వస్తే HYDలో ఉండే బ్యాచ్లర్లకు తిండి కష్టాలు వస్తాయని వాపోతున్నారు. DSNR, అమీర్పేట్, హైటెక్స్, KPHB తదితర ఏరియాల్లో ప్రైవేట్ హాస్టళ్ల యాజమాన్యాలు వారం రోజులు నోఫుడ్ బోర్డు పెట్టేశాయి. ఉద్యోగులు, విద్యార్థులకు ఇబ్బందులు తప్పవంటున్నారు. ఇక్కడే ఉండేవారు బయట తిందామంటే హోటళ్లూ బంద్ ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం తమ కోణంలో ఆలోచించి ఫుడ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
News January 12, 2026
VHT: పడిక్కల్ సరికొత్త చరిత్ర

కర్ణాటక ప్లేయర్ దేవదత్ పడిక్కల్ సరికొత్త చరిత్ర సృష్టించారు. విజయ్ హజారే ట్రోఫీలో రెండు సార్లు 700కు పైగా పరుగులు చేసిన తొలి ప్లేయర్గా నిలిచారు. 2021లో 737 రన్స్ చేయగా ప్రస్తుత సీజన్లో 721 రన్స్తో కొనసాగుతున్నారు. ఈ సీజన్లో నాలుగు సెంచరీలు, రెండు అర్ధసెంచరీలు చేశారు. ఓవరాల్గా ఈ జాబితాలో తమిళనాడు ప్లేయర్ జగదీశన్(830) ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా ఉన్నారు.
News January 12, 2026
ముత్తుకూరులో మోసం.. రూ.80 లక్షలతో మహిళ పరార్

ముత్తుకూరు మండలంలో భారీ చీటీ మోసం వెలుగులోకి వచ్చింది. అదే ప్రాంతానికి చెందిన అన్నపూర్ణమ్మ అనే మహిళ పొదుపు లీడర్గా చీటీలు వేయిస్తుంటారు. ఆమె సుమారు రూ.80 లక్షలతో పరారైనట్లు బాధితులు ఫిర్యాదు ఆరోపించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల వేదికలో వినతులు స్వీకరించిన ఎస్పీ డా.అజిత వేజెండ్ల నిందితురాలి ఆచూకిని గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


