News March 1, 2025

వేర్వేరు ఘటనల్లో ముగ్గురి ఆత్మహత్య

image

MBNR, WNP, NGKL జిల్లాల్లో శుక్రవారం వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల వివరాలిలా.. జడ్చర్లకు చెందిన వడ్డె సంజీవ(30) అప్పులు తీర్చలేక ఉరేసుకున్నాడు. గోపాల్‌పేటకు చెందిన కొంకలి మల్లయ్య(40) కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. NGKL జిల్లా పెనిమిళ్లకి చెందిన మేర కృష్ణయ్య సోదరి దగ్గర ఉంటుండగా, కడుపునొప్పి భరించలేక పొలం వద్ద ఉరేసుకున్నాడు.

Similar News

News March 1, 2025

జీడి నెల్లూరు: పింఛన్ పంపిణీ చేసిన CM 

image

జీడి నెల్లూరులో CM పర్యటన మొదలైంది. ఇందులో భాగంగా ఆయన పలువురు లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌ను పంపిణీ చేశారు. అనంతరం పలువురు వారి సమస్యలను CM దృష్టికి తీసుకురాగా.. వాటిని పరిష్కరించాలని కలెక్టర్ సుమిత్ కుమార్‌ను CM ఆదేశించారు. ఆయన వెంట ఎంపీ దుగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఉన్నారు. 

News March 1, 2025

కొవ్వెక్కిన పంది, నీతిమాలిన జెలెన్‌స్కీ: రష్యా ఫైర్

image

డొనాల్డ్ ట్రంప్, జెలెన్‌స్కీ వాగ్వాదంపై రష్యా ఘాటుగా స్పందించింది. ఎవరి మద్దతూ లేకుండా ఒంటరిగా యుద్ధం చేశానన్న జెలెన్‌స్కీ ఓ నీతిమాలిన వాడంటూ రష్యా ఫారిన్ మినిస్ట్రీ ప్రతినిధి మరియా జఖారోవా విమర్శించారు. వైట్‌హౌస్‌లో అతడికి తగిన శాస్తి జరిగిందన్నారు. మాజీ ప్రెసిడెంట్, సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ హెడ్ దిమిత్రి మెద్వెదేవ్ అయితే ఏకంగా ‘కొవ్వెక్కిన పంది’ అని తిట్టారు.

News March 1, 2025

ఇతని ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వండి: పార్వతీపురం కలెక్టర్

image

పార్వతీపురం(D)కు చెందిన అప్పారావు 20ఏళ్ల క్రితం పాండిచ్చేరి వెళ్తూ టీ తాగుదామని రైల్వే స్టేషన్‌లో దిగగా రైలు వెళ్లిపోయింది. అప్పటి నుంచి TNలోని కలైయార్కోయిల్‌లో అన్నాదురై అనే వ్యక్తి వద్ద వెట్టిచాకిరి చేస్తున్నాడు. ఇటీవల లేబర్ ఆఫీసర్లు ఈయనను గుర్తించారు. అప్పారావు తన కుటుంబ వివరాలు చెప్పలేకపోతున్నాడు. దీంతో అతని గురించి తెలిసిన వారు 8333813243 నంబరుకు తెలియజేయాలని పార్వతీపురం కలెక్టర్ కోరారు.

error: Content is protected !!