News March 1, 2025

భద్రాద్రి: ఇద్దరు యవకులు మృతి.. అక్కా చెల్లెళ్లకు కడుపుకోత!

image

భద్రాచలం గోదావరిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు <<15610313>>గల్లంతయి<<>> మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే మృతులు వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం హరిదాసుపల్లెకు చెందిన హరి ప్రసాద్(20), ఖమ్మం రఘునాథపాలెం రేగులచెలకకు చెందిన పవన్(20) గా పోలీసులు గుర్తించారు. భద్రాచలం స్వామివారి దర్శనానికి వెళ్లగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వీరి ఇద్దరి తల్లులు సొంత అక్కాచెల్లెళ్లు. సీఐ రమేశ్ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News March 1, 2025

పెనుబల్లి: చిన్నారిపై అత్యాచారయత్నం.. నిందితుడి అరెస్ట్

image

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని ఓ గ్రామంలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం కలకలంరేపింది. మద్యం మత్తులో ఉన్న దుంప వెంకటేశ్వరరావు చాక్లెట్ ఆశ చూపి చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వీ.ఎం.బంజర్ పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 1, 2025

టీచర్ MLC ఎన్నికల రిజల్ట్‌పై ఉత్కంఠ!

image

KMM, WGL, NLG టీచర్ MLC ఎన్నికల రిజల్ట్‌పై ఉత్కంఠ నెలకొంది. మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, ఎవరికి వారు గెలుస్తామనే ధీమాతో ఉన్నారు. ప్రధానంగా PRTU నుంచి శ్రీపాల్ రెడ్డి, UTF నుంచి నర్సిరెడ్డి, స్వతంత్రంగా పూల రవీందర్, BJP సరోత్తం రెడ్డి, సుందర్‌రాజ్, హర్షవర్ధన్ రెడ్డిలు ఉండగా.. శ్రీపాల్‌రెడ్డి, నర్సిరెడ్డి, రవీందర్‌ల మధ్యే పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. రిజల్ట్ కోసం మరో 2 రోజులు చూడాల్సిందే.

News March 1, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు!

image

✓ వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ✓ జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ✓ సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాగమయి దయానంద పర్యటన ✓ ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ✓ వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ✓ మధిర శివాలయంలో హుండీ లెక్కింపు ✓ ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పునఃప్రారంభం.

error: Content is protected !!