News March 1, 2025
భద్రాచలంలో ధారూర్ యువకుడి మృతి

భద్రాచలం గోదావరిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం హరిదాసుపల్లెకు చెందిన హరి ప్రసాద్(20), ఖమ్మం రఘునాథపాలెం రేగులచెలకకు చెందిన పవన్ (20)గా పోలీసులు గుర్తించారు. భద్రాచలం స్వామివారి దర్శనానికి వెళ్లగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వీరి ఇద్దరి తల్లులు సొంత అక్కాచెల్లెళ్లు కావడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
Similar News
News November 11, 2025
మా తండ్రి చనిపోలేదు: ఈషా డియోల్

తన తండ్రి ధర్మేంద్ర చనిపోలేదని కూతురు ఈషా డియోల్ ప్రకటించారు. ఆయన చనిపోయినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపారు. ధర్మేంద్ర మృతికి సంతాపం తెలుపుతూ సినీ ప్రముఖులు పోస్టులు పెట్టడంతో ఫ్యాన్స్తో పాటు మీడియా వర్గాలు ఆయన చనిపోయినట్లు భావించాయి. అయితే తాజాగా ఆయన కూతురు ధర్మేంద్ర చనిపోలేదని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు.
News November 11, 2025
ఆదిలాబాద్లో నేటి పత్తి ధర వివరాలు

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్లో మంగళవారం సీసీఐ పత్తి ధర క్వింటాల్ రూ.8,110గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,750గా నిర్ణయించారు. సోమవారం ధరతో పోలిస్తే మంగళవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పులేదు. ప్రైవేటు ధర రూ.50 తగినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలియజేశారు.
News November 11, 2025
భద్రాద్రి సుదర్శన చక్రానికి 352 ఏళ్లు

భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయం గోపురంపై ఉన్న సుదర్శన చక్రానికి విశిష్ట చరిత్ర ఉంది. కంచర్ల గోపన్న (భక్త రామదాసు) ఆలయ నిర్మాణం పూర్తవుతున్న 1674-1675 మధ్య కాలంలో శ్రీరాముడి ఆజ్ఞ మేరకు గోదావరిలో స్నానం చేస్తుండగా ఈ సుదర్శన చక్రం లభించింది. ఆనాటి నుంచి నేటి వరకు (352 ఏళ్లు) ఆలయ గోపురంపై ఇది కొనసాగుతోంది. ఈ చారిత్రక ఘట్టాన్ని భక్తులు స్మరించుకుంటున్నారు.


