News March 1, 2025

ములుగు: 25 ఏళ్ల తర్వాత తెరుచుకున్న రోడ్డు!

image

ఏటూరునాగారం పోలీస్ స్టేషన్ ముందు నుంచి 25 ఏళ్ల తర్వాత రోడ్డు మార్గానికి మోక్షం కలిగింది. 2001లో నక్సల్స్ పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి ఐదుగురిని హతమార్చారు. అప్పుడు ప్రధాన రోడ్డు పోలీస్ స్టేషన్ ముందు నుంచి ఉండటంతో మందుపాతర్లను ట్రాక్టర్లలో అమర్చి పేల్చివేశారు. అప్పటి ఎస్సై, ప్రస్తుత ఏసీపీ కిరణ్ కుమార్ ఎదురుదాడి చేసి విరోచితంగా పోరాడారు. కాగా, ప్రస్తుతం ఆ రోడ్డు మార్గం ప్రారంభం కానుంది.

Similar News

News March 1, 2025

నాలుగోసారి సీఎంను.. ఏం చేయాలో దిక్కు తోచట్లేదు: సీఎం చంద్రబాబు

image

AP: అడవి పందులు తిన్నంత తిని పంటలను తొక్కేసి పోతాయని, ఐదేళ్ల వైసీపీ పాలన ఇలాగే సాగిందని CM CBN విమర్శించారు. ‘మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చా. 2014-19 కంటే ఎక్కువ చేస్తానని ప్రజలంతా అనుకుంటున్నారు. కానీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి అర్థమైంది. ఆర్థికంగా లోతైన గోతులున్నాయి. నాలుగోసారి CM అయిన నాకే ఏం చేయాలో దిక్కుతోచట్లేదు. కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నా’ అని తెలిపారు.

News March 1, 2025

ఏలూరు: రైలు ఢీకొని వృద్ధుడి మృతి

image

ఏలూరుకు చెందిన షేక్ చాన్ బాష (64) గన్ బజార్ సెంటర్ సమీపంలోని రైలు పట్టాలు దాటుతుండగా అటుగా వస్తున్న రైలు ఢీకొని శనివారం మృతి చెందాడు. ఈ ఘటనపై రైల్వే ఎస్ఐ పీ.సైమన్ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఆయన చెప్పారు. పోస్టుమార్టం అనంతరం మృతుడి కుటుంబీకులకు మృతదేహాన్ని అందిస్తామని ఎస్ఐ చెప్పారు.

News March 1, 2025

మహిళల కోసం కొత్త కార్యక్రమాలు.. అధ్యయనానికి కమిటీ: మంత్రి

image

TG: దేశంలోనే అత్యుత్తమ మహిళా సాధికారత విధానాన్ని రూపొందించేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రి సీతక్క తెలిపారు. ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహణపై సచివాలయంలో సమీక్షించారు. రాష్ట్రంలో మహిళల కోసం అమలవుతోన్న పథకాలపై చర్చించారు. మహిళా సాధికారత కోసం కొత్త కార్యక్రమాలు, ఇతర రాష్ట్రాల మహిళా సంక్షేమ విధానాల అధ్యయనం కోసం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

error: Content is protected !!