News March 1, 2025
కులగణన రీసర్వే పూర్తి.. కేసీఆర్, హరీశ్ దూరం

TG: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండోవిడత కులగణన సర్వే నిన్నటితో పూర్తయింది. 18,539కుటుంబాలు సర్వేలో వివరాలు సమర్పించాయి. 3లక్షల56వేలకు పైగా కుటుంబాల వివరాలు సేకరించాల్సి ఉండగా కేవలం 5.21శాతం ఫ్యామిలీల సమాచారం మాత్రమే నమోదైంది. దీంతో ఇప్పటివరకూ మెుత్తంగా 1.12కోట్లకు పైగా కుటుంబాలు సర్వేలో పాల్గొన్నాయి. కేసీఆర్, హరీశ్రావు కుటుంబసభ్యులు సర్వేకు దూరంగా ఉన్నారు.
Similar News
News March 1, 2025
నాలుగోసారి సీఎంను.. ఏం చేయాలో దిక్కు తోచట్లేదు: సీఎం చంద్రబాబు

AP: అడవి పందులు తిన్నంత తిని పంటలను తొక్కేసి పోతాయని, ఐదేళ్ల వైసీపీ పాలన ఇలాగే సాగిందని CM CBN విమర్శించారు. ‘మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చా. 2014-19 కంటే ఎక్కువ చేస్తానని ప్రజలంతా అనుకుంటున్నారు. కానీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి అర్థమైంది. ఆర్థికంగా లోతైన గోతులున్నాయి. నాలుగోసారి CM అయిన నాకే ఏం చేయాలో దిక్కుతోచట్లేదు. కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నా’ అని తెలిపారు.
News March 1, 2025
మహిళల కోసం కొత్త కార్యక్రమాలు.. అధ్యయనానికి కమిటీ: మంత్రి

TG: దేశంలోనే అత్యుత్తమ మహిళా సాధికారత విధానాన్ని రూపొందించేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రి సీతక్క తెలిపారు. ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహణపై సచివాలయంలో సమీక్షించారు. రాష్ట్రంలో మహిళల కోసం అమలవుతోన్న పథకాలపై చర్చించారు. మహిళా సాధికారత కోసం కొత్త కార్యక్రమాలు, ఇతర రాష్ట్రాల మహిళా సంక్షేమ విధానాల అధ్యయనం కోసం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
News March 1, 2025
HIGH ALERT: ఈ ఎండా కాలం అంత ఈజీ కాదు

TG: ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా APR, MAYలో 44-46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. దక్షిణ, మధ్య తెలంగాణ, HYD పరిసర ప్రాంతాల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. రాత్రి ఉష్ణోగ్రతలు సైతం సాధారణం కంటే 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందంది. 1901-2025 సగటు ఉష్ణోగ్రత తీసుకుంటే ఈ ఏడాదే తీవ్రత అధికమని పేర్కొంది.