News March 1, 2025

ఇంటర్ విద్యార్థులకు ఆల్‌ ది బెస్ట్ చెప్పిన సీఎం, లోకేశ్

image

AP: నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. పిల్లలందరూ ధైర్యంగా ఉండాలని, ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని Xలో పోస్ట్ చేశారు. వేసవికాలం కావడంతో డీహైడ్రేట్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి లోకేశ్ సూచించారు. ప్రయత్నం సరిగ్గా చేస్తే తప్పకుండా విజయం లభిస్తుందని ట్వీట్ చేశారు.

Similar News

News March 1, 2025

HIGH ALERT: ఈ ఎండా కాలం అంత ఈజీ కాదు

image

TG: ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా APR, MAYలో 44-46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. దక్షిణ, మధ్య తెలంగాణ, HYD పరిసర ప్రాంతాల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. రాత్రి ఉష్ణోగ్రతలు సైతం సాధారణం కంటే 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందంది. 1901-2025 సగటు ఉష్ణోగ్రత తీసుకుంటే ఈ ఏడాదే తీవ్రత అధికమని పేర్కొంది.

News March 1, 2025

గత ఐదేళ్లూ రాష్ట్రంలో నవ్వే లేదు: సీఎం చంద్రబాబు

image

AP: వైసీపీ హయాంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని సీఎం చంద్రబాబు అన్నారు. గత ఐదేళ్లూ రాష్ట్రంలో నవ్వే లేదని, ఇప్పుడు ఎక్కడ చూసినా సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఈ 9 నెలల్లో ఇదే పెద్ద మార్పు అని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లను రూ.4వేలకు పెంచి ఒకటో తేదీనే ఇస్తున్నామని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా GD నెల్లూరులో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దూసుకెళ్తోందని వివరించారు.

News March 1, 2025

‘అఖండ-2’: హిమాలయాలకు బోయపాటి!

image

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తోన్న ‘అఖండ-2’ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం హిమాలయాల్లో అద్భుతమైన ప్రదేశాలను గుర్తించే పనిలో బోయపాటి ఉన్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇంతకుముందు చూడనటువంటి ప్రదేశాల్లో కొన్ని అసాధారణ సన్నివేశాలను చిత్రీకరించేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలవనున్నట్లు టాక్.

error: Content is protected !!