News March 1, 2025

నంద్యాల జిల్లాలో 50% పంపిణీ పూర్తి

image

నంద్యాల జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రభుత్వం ఆదేశాలతో తొలిసారిగా ఉదయం 7 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కాగా.. ఉ.9:30 గంటలకు నంద్యాల జిల్లాలో 59.41% పింఛన్ల పంపిణీ పూర్తయింది. కాగా, ఇప్పటివరకు జిల్లాలో 2,15,031 మందికి గానూ 1,27,746 మందికి సచివాలయ ఉద్యోగులు పింఛన్ సొమ్మును అందజేశారు.

Similar News

News January 5, 2026

చలి తీవ్రతతో కోళ్లకు పెరుగుతున్న ముప్పు

image

చలి గాలులు, పొగ మంచు వల్ల రాత్రి వేళ కోళ్ల షెడ్లలో తేమ అధికమై అది ఆవిరి కాకుండా ఉండిపోతుంది. దీని వల్ల కోళ్లలో శ్వాస సంబంధ వ్యాధుల ముప్పు, లిట్టర్‌లో తేమ శాతం పెరగడం వల్ల పరాన్నజీవులు, శిలీంధ్రాల బెడద పెరుగుతుంది. చలికి కోళ్లు ఒత్తిడికి లోనవడం వల్ల వాటిలో వ్యాధి నిరోధకత శక్తి తగ్గి CRD, ఐబీ, కొక్కెర రోగం, బ్రూడర్ న్యుమోనియా, కోకిడియోసిస్ వ్యాధుల ముప్పు పెరిగి కోళ్ల మరణాలకు కారణమయ్యే ప్రమాదం ఉంది.

News January 5, 2026

సూర్యాపేట: ట్యాంకర్ ఢీకొని అసిస్టెంట్ మేనేజర్ మృతి

image

తిరుమలగిరి మండలం తొండ గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యూనియన్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ సతీష్ (45) దుర్మరణం చెందారు. తన స్వగ్రామం ఐనోలు నుంచి వస్తుండగా, ఎదురుగా వచ్చిన పెట్రోల్ ట్యాంకర్ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 5, 2026

నీళ్లు వృథా కాకుండా ఎవరైనా వాడుకోవచ్చు: సీఎం చంద్రబాబు

image

AP: ఏటా కృష్ణా, గోదావరి నుంచి వేల టీఎంసీలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయని తెలుగు మహా సభలో సీఎం చంద్రబాబు తెెలిపారు. అందుకే ఉమ్మడి ఏపీలోనూ ఎన్నో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు. ఇప్పుడూ నీళ్లు వృథా కాకుండా ఎవరు వాడుకున్నా ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ఇక నదుల అనుసంధానంతో దేశంలో నీటి సమస్య లేకుండా చేయాలని సీఎం చెప్పారు. గంగా-కావేరీ, గోదావరి-పెన్నా నదులు కలవాలన్నారు.