News March 1, 2025
ట్రంప్కు క్షమాపణ చెప్పను: జెలెన్స్కీ

ఓవెల్ ఆఫీస్ ఘటనపై ట్రంప్కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పష్టం చేశారు. తాను తప్పు చేశానని అనుకోవటం లేదని, అయితే అమెరికా అధ్యక్షుడిని, ప్రజలను గౌరవిస్తానని ఇంటర్వ్యూలో తెలిపారు. ట్రంప్ తటస్థంగా ఉండాలని కోరారు. ఉక్రెయిన్లోని ఖనిజాల తవ్వకం ఒప్పందంపై భేటీలో USనుంచి రక్షణ కావాలని జెలెన్స్కీ ఒత్తిడి చేయగా ఇరువురి మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే.
Similar News
News March 1, 2025
CT ఫైనల్లో ఆ జట్టే గెలుస్తుంది: ఆసీస్ మాజీ కెప్టెన్

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్కు వెళ్తాయని మాజీ క్రికెటర్ మైఖేల్ క్లార్క్ అభిప్రాయపడ్డారు. తుది పోరులో ఆస్ట్రేలియాను టీమ్ ఇండియా ఒక్క పరుగు తేడాతో ఓడిస్తుందని జోస్యం చెప్పారు. దుబాయ్లో పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందని, భారత ప్లేయర్లు మంచి ఫామ్లో ఉన్నారని తెలిపారు. కెప్టెన్ రోహిత్ శర్మ అటాకింగ్ గేమ్ భారత్కు కీలకంగా మారనుందన్నారు.
News March 1, 2025
నాలుగోసారి సీఎంను.. ఏం చేయాలో దిక్కు తోచట్లేదు: సీఎం చంద్రబాబు

AP: అడవి పందులు తిన్నంత తిని పంటలను తొక్కేసి పోతాయని, ఐదేళ్ల వైసీపీ పాలన ఇలాగే సాగిందని CM CBN విమర్శించారు. ‘మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చా. 2014-19 కంటే ఎక్కువ చేస్తానని ప్రజలంతా అనుకుంటున్నారు. కానీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి అర్థమైంది. ఆర్థికంగా లోతైన గోతులున్నాయి. నాలుగోసారి CM అయిన నాకే ఏం చేయాలో దిక్కుతోచట్లేదు. కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నా’ అని తెలిపారు.
News March 1, 2025
మహిళల కోసం కొత్త కార్యక్రమాలు.. అధ్యయనానికి కమిటీ: మంత్రి

TG: దేశంలోనే అత్యుత్తమ మహిళా సాధికారత విధానాన్ని రూపొందించేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రి సీతక్క తెలిపారు. ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహణపై సచివాలయంలో సమీక్షించారు. రాష్ట్రంలో మహిళల కోసం అమలవుతోన్న పథకాలపై చర్చించారు. మహిళా సాధికారత కోసం కొత్త కార్యక్రమాలు, ఇతర రాష్ట్రాల మహిళా సంక్షేమ విధానాల అధ్యయనం కోసం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.