News March 1, 2025
జగిత్యాల: కుక్కల దాడిలో మూడేళ్ల బాలుడికి తీవ్ర గాయాలు

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన కందరి శ్రీయాన్స్ అనే మూడేళ్ల బాలుడిపై కుక్కలు దాడిచేయడంతో తీవ్రగాయాలైనట్లు గ్రామస్థులు తెలిపారు. బాలుడు శుక్రవారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటుండగా.. కుక్కలు దాడి చేసి మెడపై గాయపరిచాయి. బాలుడిని చికిత్స నిమిత్తం కరీంనగర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. గ్రామంలో కుక్కల బెడదను నివారించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Similar News
News March 1, 2025
ఖమ్మం: ‘విద్యార్థులను వేధిస్తున్న లెక్చరర్’

బాడీ పార్ట్స్ తాకనిస్తేనే ఇంటర్నల్ మార్కులు వేస్తానని ఇంటర్ విద్యార్థులను ఓ కాంట్రాక్ట్ లెక్చరర్ వేధించిన ఘటన ఖమ్మం నగరంలో జరిగింది. విద్యార్థులు తెలిపి వివరాలు.. ఖమ్మం వాసి కొండా హరిశంకర్ అనే వ్యక్తి స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్గా పనిచేస్తున్నాడు. కొద్ది రోజులుగా విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని విద్యార్థి సంఘం నాయకులు ఈరోజు ధర్నా చేపట్టారు.
News March 1, 2025
ఖమ్మం: ‘విద్యార్థులను వేధిస్తున్న లెక్చరర్’

బాడీ పార్ట్స్ తాకనిస్తేనే ఇంటర్నల్ మార్కులు వేస్తానని ఇంటర్ విద్యార్థులను ఓ కాంట్రాక్ట్ లెక్చరర్ వేధించిన ఘటన ఖమ్మం నగరంలో జరిగింది. విద్యార్థులు తెలిపి వివరాలు.. ఖమ్మం వాసి కొండా హరిశంకర్ అనే వ్యక్తి స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్గా పనిచేస్తున్నాడు. కొద్ది రోజులుగా విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని విద్యార్థి సంఘం నాయకులు ఈరోజు ధర్నా చేపట్టారు.
News March 1, 2025
నేరాల నియంత్రణలో జాగిలాల పాత్ర కీలకం: CP

నేరాల నియంత్రణలో నార్కోటిక్, ఎక్స్ క్లూజివ్, గంజాయి వాటిని గుర్తించడంలో పోలీస్ జాగిలాల పాత్ర కీలకమని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో ఈ జాగిలాలు ఏడాది శిక్షణ పూర్తి చేసుకొని రామగుండం కమిషనరేట్కు వచ్చాయన్నారు. డాగ్స్& డాగ్స్ హ్యాండ్లర్స్ పోలీస్ కమిషనర్ను మర్యాదపూర్వకంగా కలిశారు.