News March 1, 2025

మహిళలను ప్రభుత్వం మోసం చేసింది: వైసీపీ

image

AP: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు మెుండి చెయ్యి చూపిందని వైసీపీ ఆరోపించింది. ఉగాది నుంచి ఉచిత బస్సు పథకం అమలు చేస్తామని ఆశ చూపించి బడ్జెట్‌లో దాని ఊసే ఎత్తలేదంది. ఆర్టీసీకి కేటాయించిన నిధులు ఉద్యోగుల జీతాలకే సరిపోతాయని పేర్కొంది. పథకం అమలు కావాలంటే అదనంగా రూ.3,182 కోట్లు కావాల్సిఉండగా ఒక్కపైసా కేటాయించలేదని తెలిపింది. అధికారంలోకి రాగానే పథకం అమలు చేస్తామని మహిళలను మోసం చేసిందని వైసీపీ ఆరోపించింది.

Similar News

News November 5, 2025

ఒక్క సేఫ్టీ పిన్ ధర రూ.69వేలు!

image

వివిధ అవసరాలకు వాడే సేఫ్టీ పిన్ (పిన్నీసు/ కాంట) ఊర్లో జరిగే సంతలో, దుకాణాల్లో రూ.5కే డజను లభిస్తాయి. అయితే వాటికి దారాలు చుట్టి భారీ ధరకు అమ్మేస్తోంది లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ ‘ప్రడా’ (Prada). చిన్న మెటల్ సేఫ్టీ పిన్ బ్రోచ్ ధర 775 డాలర్లు (సుమారు రూ. 69,114) ఉండటంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అతి సాధారణ వస్తువులనూ బ్రాండింగ్ చేస్తూ సంపన్నులను ఆకర్షిస్తున్నాయి ఈ కంపెనీలు. దీనిపై మీరేమంటారు?

News November 5, 2025

ఉమ్మనీరు ఎక్కువైతే ఏం చేయాలంటే?

image

తల్లికి షుగర్ నియంత్రణలో లేకపోతే ఉమ్మనీరు ఎక్కువగా ఉంటుంది. అలాగే అల్ట్రా సౌండ్‌ గైడెడ్‌ ఆమ్నియోసెంటెసిస్‌ ద్వారా కూడా ఉమ్మనీరును కొంతవరకు నియంత్రణలో ఉంచవచ్చు. తల్లికి డెలివరీ కాంప్లికేషన్లు వస్తే డాక్టర్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. కొన్నిసార్లు అధిక ఉమ్మనీరు కాన్పు సమయంలో బిడ్డకు ప్రాణాంతకమై నియోనేటల్ సేవలు అవసరమవుతాయి. కాబట్టి అన్ని వసతులు ఉన్న ఆసుపత్రిలో కాన్పు చేయించుకుంటే మంచిది.

News November 5, 2025

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA

image

AP: నైరుతి బంగాళాఖాతం నుంచి ఉ.కేరళ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ MD ప్రఖర్ జైన్ తెలిపారు. రేపు కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొన్నారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందన్నారు.