News March 1, 2025

మీ జీతం కూడా ఇండియా వల్లే: సునీల్ గవాస్కర్

image

దుబాయ్‌లో ఆడటం భారత్‌కు కలిసివచ్చిందన్న ఇంగ్లండ్ మాజీల వ్యాఖ్యలను సునీల్ గవస్కర్ తిప్పికొట్టారు. ఓటమి అక్కసు తమ టీమ్‌పై చూపకూడదన్నారు. భద్రతాలోపాలతోనే దుబాయ్‌లో ఆడుతున్నట్లు బీసీసీఐ ముందే ప్రకటించిందన్నారు. ఐసీసీకి భారత్ ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తోందని, మీడియా హక్కుల ద్వారా ఆదాయం వస్తుందని చెప్పారు. వారికొచ్చే జీతం కూడా పరోక్షంగా(నాజర్ హుస్సేన్, మైక్ అథర్టన్) భారత్ ద్వారానే అందుతుందన్నారు.

Similar News

News March 1, 2025

దేశానికి రోల్ మోడల్‌లా పోలీస్ స్కూల్: సీఎం

image

TG: యంగ్ ఇండియా పోలీస్ స్కూలులో పోలీస్ అమరుల కుటుంబాల పిల్లలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశించారు. HYD మంచిరేవులలోని గ్రేహౌండ్స్ క్యాంపస్ సమీపంలోని ఈ స్కూలులో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. సైనిక్ స్కూల్ తరహాలో పోలీస్ స్కూల్‌ను దేశానికి రోల్ మాడల్‌గా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. స్కూల్ <>వెబ్‌సైట్‌ను<<>> లాంచ్ చేశారు.

News March 1, 2025

‘అందుకొనేంత దూరంలో అభివృద్ధి చెందిన దేశం’

image

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న లక్ష్యం అందుకొనేంత దూరంలోనే ఉందని 16వ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ అరవింద్ పనగడియా అన్నారు. ఇందుకు కొన్ని సంస్కరణలు అవసరమని సూచించారు. ‘ప్రస్తుత ధరల వద్ద డాలర్‌ ప్రాతిపదికన 2003-24 వరకు భారత్ 10.1% వృద్ధిరేటు సాధించింది. మరో పదేళ్లు ఇదే రేటు కొనసాగిస్తే దేశం $9.5T ఎకానమీ అవుతుంది. 2047 నాటికి తలసరి ఆదాయం $14000 కావాలంటే 7.3% గ్రోత్ అవసరం’ అని వివరించారు.

News March 1, 2025

టీచర్ల బదిలీలు.. గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి

image

AP: ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీ మేరకు పారదర్శకంగా టీచర్ల ట్రాన్స్‌ఫర్ ప్రక్రియకు తాము కట్టుబడి ఉన్నామని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ఏపీ టీచర్స్ ట్రాన్స్‌ఫర్ రెగ్యులేషన్ యాక్ట్ 2025 <>ముసాయిదాపై<<>> ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని కోరారు. ఉపాధ్యాయుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ విద్యావ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు. ముసాయిదాపై సలహాలు, సూచనలను draft.aptta2025@gmail.comకు ఈ నెల 7లోపు మెయిల్ పంపించాలని కోరారు.

error: Content is protected !!