News March 1, 2025

నీరాకేఫ్ గీత పారిశ్రామిక కార్పొరేషన్‌కు అప్పగిస్తాం: మంత్రి పొన్నం

image

నిరాకేఫ్ను పూర్తిస్థాయిలో గీతా పారిశ్రామిక కార్పొరేషన్కు అప్పగించడానికి నిర్ణయం తీసుకున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం మినిస్టర్ క్వార్టర్స్‌లో గౌడ సంఘం నేతలు మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, పల్లె లక్ష్మణరావు గౌడ్ ఇతర నాయకులు మంత్రిని కలిసి పలు అంశాలను దృష్టికి తెచ్చారు. నీరాకేష్, పాపన్న గౌడ్ విగ్రహం, గౌడ సంఘం భవన నిర్మాణం అంశాలు CM దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి తెలిపారు.

Similar News

News March 1, 2025

NZB: యాసంగిలో ఎరువుల కొరత లేకుండా చర్యలు చేపట్టాలి: కలెక్టర్

image

ప్రస్తుత యాసంగి సీజన్‌లో ఎరువుల కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని వ్యవసాయ అధికారులను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. గత సీజన్లతో పోలిస్తే ఈసారి ఎరువులకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉందన్నారు. గతేడాది రబీలో 63 వేల మెట్రిక్ టన్నుల ఎరువులను వినియోగించగా, ఈ సారి 77 వేల మెట్రిక్ టన్నులకు ఎరువుల డిమాండ్ పెరిగిందని వివరించారు.

News March 1, 2025

దివ్యాంగులకు ఇక నుంచి UDID కార్డులు

image

TG: సదరం సర్టిఫికెట్లకు రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలికింది. దివ్యాంగులకు ఇక నుంచి యూనిక్ డిసెబిలిటీ ఐడెంటిటీ కార్డు(UDID) ఇవ్వాలని నిర్ణయించింది. సదరం సర్టిఫికెట్ ఉన్న దివ్యాంగులందరికీ UDID నంబర్ జనరేట్ చేయాలని జిల్లా కలెక్టర్లను సెర్ఫ్ సీఈవో దివ్య దేవరాజన్ ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ కార్డులు ఉపయోగపడతాయని స్పష్టం చేశారు. మీ సేవల్లో స్లాట్ బుక్ చేసుకుని, సదరం క్యాంపుకు వెళ్తే UDID ఇస్తారు.

News March 1, 2025

నేలపై కూర్చుని తింటున్నారా?

image

డైనింగ్ టేబుల్ కాకుండా నేల మీద కూర్చుని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ‘ప్లేట్‌లోని ఆహారాన్ని వంగి తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. కండరాలు, శారీరక నొప్పులు దూరమవుతాయి. భోజనం ఎంత తింటున్నామో జ్ఞప్తిలో ఉంటుంది. తద్వారా బరువును కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. నేలపై కూర్చుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది’ అని పేర్కొంటున్నారు.* మీరు ఎలా తింటారు? కామెంట్ చేయండి.

error: Content is protected !!