News March 1, 2025
100 రోజుల్లోపే శిక్ష పడేలా పనిచేయాలి: హోంమంత్రి అనిత

AP: నేరం చేసిన వంద రోజుల్లోపే శిక్షలు పడేలా పనిచేయాలని ట్రైనింగ్ పూర్తి చేసుకున్న SIలకు హోంమంత్రి అనిత సూచించారు. నిజాయితీగా ప్రజల రక్షణకు ముందుకెళ్లాలన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్సైల పాసింగ్ పరేడ్లో ఆమె పాల్గొన్నారు. మొత్తం 395 మంది ఎస్సైలుగా శిక్షణ పూర్తి చేసుకోగా వీరిలో 97 మంది మహిళలు ఉన్నారు. మహిళలు ఇంత సంఖ్యలో ఉండటం గర్వకారణమని అన్నారు. ఈ పరేడ్కు డీజీపీ హరీశ్ గుప్తా హాజరయ్యారు.
Similar News
News November 4, 2025
వయ్యారిభామను కట్టడి చేసే కలుపు మందులు

వయ్యారిభామ నిర్మూలనకు పంట మొలకెత్తక ముందు అట్రాజిన్ రసాయన మందును లీటర్ నీటికి నాలుగు గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. పంట మొలకెత్తిన 15 నుంచి 20 రోజులకు.. లీటరు నీటికి 2 గ్రాముల 2,4-డి సోడియం సాల్ట్ కలిపి పిచికారీ చేయాలి. బంజరు భూముల్లో లీటరు నీటికి 5 గ్రాముల అట్రాజిన్ మందు కలిపి పిచికారీ చేసి వయ్యారిభామను నివారించవచ్చు. కలుపు నివారణ మందులను పిచికారీ చేసేటప్పుడు పక్క పంటలపై పడకుండా జాగ్రత్తపడాలి.
News November 4, 2025
ఇతిహాసాలు క్విజ్ – 56

1. కౌరవ, పాండవుల గురువైన ద్రోణాచార్యుడి గురువు ఎవరు?
2. మేఘనాదుడు ఎవరిని పూజించడం వల్ల ఇంద్రజిత్ అయ్యాడు?
3. నవ విధ భక్తి మార్గాలలో మొదటిది ఏమిటి?
4. ప్రతి మాసంలో వచ్చే పన్నెండో తిథి పేరు ఏమిటి?
5. సీత స్వయంవరం లో ఉన్న శివధనుస్సు అసలు పేరు ఏమిటి?
– సరైన సమాధానాలను సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం. <<-se>>#Ithihasaluquiz<<>> 
News November 4, 2025
తెలంగాణ రౌండప్

✒ నెలఖారులోగా ఉచిత చేపపిల్లల పంపిణీ చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాలు
✒ ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి కొనుగోలుకు పరిమితి విధించిన సీసీఐ. నిబంధనలు ఎత్తివేయాలని కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ.
✒ వచ్చే నెల 19-29 వరకు హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో పుస్తక ప్రదర్శన
✒ ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు నిర్మణానికి 700 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం అనుమతి 


