News March 1, 2025
ఇతని ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వండి: పార్వతీపురం కలెక్టర్

పార్వతీపురం(D)కు చెందిన అప్పారావు 20ఏళ్ల క్రితం పాండిచ్చేరి వెళ్తూ టీ తాగుదామని రైల్వే స్టేషన్లో దిగగా రైలు వెళ్లిపోయింది. అప్పటి నుంచి TNలోని కలైయార్కోయిల్లో అన్నాదురై అనే వ్యక్తి వద్ద వెట్టిచాకిరి చేస్తున్నాడు. ఇటీవల లేబర్ ఆఫీసర్లు ఈయనను గుర్తించారు. అప్పారావు తన కుటుంబ వివరాలు చెప్పలేకపోతున్నాడు. దీంతో అతని గురించి తెలిసిన వారు 8333813243 నంబరుకు తెలియజేయాలని పార్వతీపురం కలెక్టర్ కోరారు.
Similar News
News March 1, 2025
నేలపై కూర్చుని తింటున్నారా?

డైనింగ్ టేబుల్ కాకుండా నేల మీద కూర్చుని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ‘ప్లేట్లోని ఆహారాన్ని వంగి తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. కండరాలు, శారీరక నొప్పులు దూరమవుతాయి. భోజనం ఎంత తింటున్నామో జ్ఞప్తిలో ఉంటుంది. తద్వారా బరువును కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. నేలపై కూర్చుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది’ అని పేర్కొంటున్నారు.* మీరు ఎలా తింటారు? కామెంట్ చేయండి.
News March 1, 2025
గాలికుంటు టీకాల పోస్టర్ల ఆవిష్కరణ

జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం కింద గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్లను శనివారం జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమం 01/03/25 నుంచి 30/03/25 తేదీ వరకు ఉచితంగా అన్ని గ్రామాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అధికారులు ఉన్నారు.
News March 1, 2025
మ్యాచులు రద్దు.. టికెట్ డబ్బులు రీఫండ్: PCB

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈనెల 25, 27న రావల్పిండిలో జరగాల్సిన మ్యాచులు టాస్ పడకుండానే రద్దయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచుల కోసం టికెట్లు కొన్న ప్రేక్షకులకు పూర్తి డబ్బులను రీఫండ్ చేయనున్నట్లు పాక్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. డ్యామేజ్ అవని ఒరిజినల్ టికెట్లతో వచ్చి టికెట్ సెంటర్ల వద్ద డబ్బులు తీసుకోవాలని సూచించింది. బాక్సెస్, గ్యాలరీ టికెట్లు తీసుకున్న వారికి రీఫండ్ వర్తించదని పేర్కొంది.