News March 1, 2025

ఏలూరు: రైలు ఢీకొని వృద్ధుడి మృతి

image

ఏలూరుకు చెందిన షేక్ చాన్ బాష (64) గన్ బజార్ సెంటర్ సమీపంలోని రైలు పట్టాలు దాటుతుండగా అటుగా వస్తున్న రైలు ఢీకొని శనివారం మృతి చెందాడు. ఈ ఘటనపై రైల్వే ఎస్ఐ పీ.సైమన్ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఆయన చెప్పారు. పోస్టుమార్టం అనంతరం మృతుడి కుటుంబీకులకు మృతదేహాన్ని అందిస్తామని ఎస్ఐ చెప్పారు.

Similar News

News March 1, 2025

కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

➤ మంత్రాలయ రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న నారా లోకేశ్➤ ఇంటర్ పరీక్షలు.. తొలిరోజు 611 మంది విద్యార్థుల గైర్హాజరు➤ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ తక్షణమే ఇవ్వాలని లోకేష్‌కు వినతి ➤ కడిమెట్లలో జిల్లా కలెక్టర్ పర్యటన➤ రాయలసీమలో వలసలు నివారించడమే లక్ష్యం: లోకేశ్ ➤ ఆదోని: వైసీపీని వీడిన 75 కుటుంబాలు➤ లోకేష్ పర్యటనలో ఆసక్తికర ఘటన

News March 1, 2025

విశాఖ: సోదరి ఇంటికి వెళ్తూ ప్రమాదంలో మహిళ మృతి

image

విశాఖ సెంట్రల్ జైల్ సమీపంలో ఎస్ఎస్ఎ నగర్ ఎదురుగా బిఆర్ఎస్ రోడ్డులో స్కార్పియో వాహనం ఢీకొని గెడ్డం సావిత్రి(62) అనే మహిళ మృత్యువాత పడినట్లు ఆరిలోవ ట్రాఫిక్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. రోడ్డు దాటుతుండగా సెంటర్ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. మృతురాలు ఆనందపురం గ్రామం కాగా స్థానికంగా ఉన్న సోదరి ఇంటికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడినట్లు తెలిపారు.

News March 1, 2025

నిర్మల్‌: బైక్‌ను ఢీకొన్న లారీ.. వ్యక్తికి గాయాలు

image

నిర్మల్‌లోని శివాజీ చౌక్ వద్ద సిగ్నల్ పడడంతో ఆగి ఉన్న బైక్‌ను లారీ ఢీకొంది. దీంతో బైక్ పై వెళ్తున్న వసంతరావు తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. పట్టణానికి చెందిన వసంతరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

error: Content is protected !!