News March 1, 2025

కిర్లంపూడి: ఆటోను ఢీకొట్టిన కారు.. ఒకరి మృతి

image

కిర్లంపూడి మండలం సోమవరం జంక్షన్ వద్ద NH-16పై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ నూకరాజు(47) మృతి చెందాడు. కిర్లంపూడి పోలీసుల వివరాల ప్రకారం.. సోమవరం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నూకరాజు ఖాళీ వాటర్ కేన్‌లతో ఆటోపై ఇంటికి వస్తుండగా వైజాగ్ వైపు వెళుతున్న కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కిర్లంపూడి ఎస్సై సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News March 1, 2025

ప్రతి నియోజకవర్గంలో ఓ మోడల్ స్కూల్: మంత్రి లోకేశ్

image

AP: <<14566229>>అపార్ ఐడీ<<>> ద్వారా KG- PG వరకు విద్యార్థుల పురోగతిని ట్రాక్ చేయాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో ఓ మోడల్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. PG ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలుకు విధివిధానాలు రూపొందించాలని, అమరావతిలో AI, స్పోర్ట్స్ వర్సిటీల పనులను వేగవంతం చేయాలని సూచించారు. వెల్ఫేర్ హాస్టళ్లలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు.

News March 1, 2025

వికారాబాద్ జిల్లా శనివారం ముఖ్యంశాలు

image

✓కొడంగల్: వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి సహకరించాలి.✓ VKB: జిల్లా వ్యాప్తంగా 22,404 రేషన్ కార్డులు మంజూరు.✓ వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ గా సుధీర్.✓ ధరూర్: ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య.✓ TNDR: 77 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే.✓ VKB:రంజాన్ మాస ప్రారంభ శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్.✓ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎమ్మార్పీఎస్ అమరవీరులకు నివాళి.

News March 1, 2025

RR: 10వ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

image

ఇంటర్మీడియట్, టెన్త్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతి లేదని, పరీక్షలు జరిగే ప్రదేశాలలో జిరాక్స్ సెంటర్‌లను మూసివేయాలన్నారు. 185 ఇంటర్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు, ఇంటర్ మొదటి, రెండవ వార్షిక పరీక్షలకు 1,47,211 మంది, పది వార్షిక పరీక్షలకు 51,794 విద్యార్థుల పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.

error: Content is protected !!