News March 1, 2025
ఈ నెలలో విడుదలయ్యే చిత్రాలివే..

మార్చి నెలలో టాలీవుడ్లో బిగ్ హీరోల సినిమాల రిలీజ్ లేకపోయినా పలు ఆసక్తికర చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ నెల 7న ఛావా(తెలుగు డబ్), 14న కిరణ్ అబ్బవరం ‘దిల్రూబా’, 28న నితిన్ ‘రాబిన్ హుడ్’, 29న ‘మ్యాడ్ స్క్వేర్’ విడుదల కానున్నాయి. వీటితో పాటు అనువాద చిత్రాలు కింగ్ స్టన్, ఆఫీసర్ ఆన్ డ్యూటీ, వీర ధీర శూరన్ 2(విక్రమ్), L2:ఎంపురాన్ ఇదే నెలలో రిలీజ్ కానున్నాయి. మీరు ఏ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు?
Similar News
News March 1, 2025
కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ ఎయిర్పోర్ట్: సీఎం

TG: వరంగల్(D) మామునూరు విమానాశ్రయం కేరళలోని కొచ్చి ఎయిర్పోర్టు తరహాలో ఉండాలని అధికారులకు CM రేవంత్ సూచించారు. నిత్యం రాకపోకలతో కార్యకలాపాలు జరిగేలా డిజైన్ రూపకల్పన జరగాలన్నారు. విమానాశ్రయ నిర్మాణానికి కేంద్రం నుంచి అనుమతి వచ్చిన నేపథ్యంలో సమీక్ష నిర్వహించారు. సాధ్యమైనంత తొందరగా భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేసి డిజైనింగ్కు పంపించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News March 1, 2025
ఆ స్టార్ హీరోలను కలవాలని ఉంది: మోనాలిసా

సోషల్ మీడియా పాపులారిటీతో సెన్సేషన్గా మారిన మోనాలిసా ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. హీరోయిన్లు కంగనా రనౌత్, సోనాక్షి సిన్హా నుంచి తాను స్ఫూర్తి పొందుతానని చెప్పారు. బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్, సన్ని డియోల్ను కలవాలని ఉందని తెలిపారు. ఈ జనరేషన్ నటులు వరుణ్ ధవన్, టైగర్ ష్రాఫ్ గురించి తెలియదని చెప్పారు. అవకాశం ఇస్తానని చెప్పిన సనోజ్ మిశ్రా తనను కూతురిలా చూసుకుంటారని పేర్కొన్నారు.
News March 1, 2025
డ్రగ్స్పై పంజాబ్ యుద్ధం

మాదకద్రవ్యాలను అరికట్టడమే లక్ష్యంగా పంజాబ్ ప్రభుత్వం భారీ ఆపరేషన్ చేపట్టింది. ఇవాళ ఒక్కరోజే 12వేల మందికి పైగా పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా 750 ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. 8 కిలోల హెరాయిన్, 16వేలకు పైగా మత్తు ట్యాబ్లెట్స్ను స్వాధీనం చేసుకున్నారు. 290 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. తమ పోరాటానికి పార్టీలకతీతంగా మద్దతు ఇవ్వాలని ఆప్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.