News March 1, 2025

వారికి ఎక్స్‌గ్రేషియా.. సీఎం కీలక ఆదేశాలు

image

TG: గల్ఫ్‌లో మరణించిన కార్మికుల కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. రూ.5 లక్షల చొప్పున 113 బాధిత కుటుంబాలకు వెంటనే నిధులు విడుదల చేయాలన్నారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఖనిజాభివృద్ధి శాఖ సమీక్ష సందర్భంగా అధికారులు ఎక్స్‌గ్రేషియా విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తక్షణమే స్పందించిన సీఎం నిధుల విడుదలకు ఆదేశాలు జారీ చేశారు.

Similar News

News March 2, 2025

వైసీపీ శ్రేణులకు పనులు, సాయం చేయొద్దు: సీఎం చంద్రబాబు

image

AP: వైసీపీ శ్రేణులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలాంటి పనులూ చేయొద్దని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వారికి సాయం చేస్తే పాముకు పాలు పోసినట్లేనన్నారు. ఈ విషయాన్ని పార్టీ శ్రేణులకు గట్టిగా చెబుతున్నానంటూ హెచ్చరించారు. జీడీ నెల్లూరు కార్యకర్తలతో సమావేశంలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలని సూచించారు. నాయకులు తన చుట్టూ కాకుండా ప్రజల చుట్టూ తిరగాలన్నారు.

News March 2, 2025

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ATC: CM

image

TG: రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్స్(ITI)లను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు(ATC)గా అప్‌గ్రేడ్ చేయడంపై CM రేవంత్ సమీక్షించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో తప్పనిసరిగా ఒక ATC ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ITIలు లేని కేంద్రాల్లో కొత్తగా ATCలను ఏర్పాటు చేయాలన్నారు. నియోజకవర్గ కేంద్రాలు/పట్టణాలకు సమీపంలో ATCలు ఉండేలా చూడాలని, అవసరమైన నిధులను అందిస్తామని చెప్పారు.

News March 1, 2025

ప్రతి నియోజకవర్గంలో ఓ మోడల్ స్కూల్: మంత్రి లోకేశ్

image

AP: <<14566229>>అపార్ ఐడీ<<>> ద్వారా KG- PG వరకు విద్యార్థుల పురోగతిని ట్రాక్ చేయాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో ఓ మోడల్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. PG ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలుకు విధివిధానాలు రూపొందించాలని, అమరావతిలో AI, స్పోర్ట్స్ వర్సిటీల పనులను వేగవంతం చేయాలని సూచించారు. వెల్ఫేర్ హాస్టళ్లలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు.

error: Content is protected !!