News March 1, 2025
చెస్ ర్యాంకింగ్స్.. టాప్-10లో ముగ్గురు ఇండియన్స్

ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ (FIDE) తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్లో భారత్ నుంచి ముగ్గురు ప్లేయర్లు టాప్-10లో నిలిచారు. మూడో స్థానంలో గుకేశ్(2787), ఐదో స్థానంలో అర్జున్ ఎరిగైసి (2777), ఎనిమిదో ర్యాంకులో ప్రజ్ఞానంద(2758) ఉన్నారు. గుకేశ్కు తన కెరీర్లో ఇదే హైయెస్ట్ ర్యాంకింగ్. కాగా తొలి రెండు స్థానాల్లో కార్ల్సన్(2833), నకమురా(2802) కొనసాగుతున్నారు.
Similar News
News March 2, 2025
TODAY HEADLINES

AP: జూన్ నాటికి DSC ప్రక్రియ పూర్తి: సీఎం చంద్రబాబు
AP: ఆశా వర్కర్ల రిటైర్మెంట్ వయసు పెంపు
AP: జైలులో పోసానికి అస్వస్థత.. నాటకం ఆడారన్న పోలీసులు
TG: కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెండ్
TG: దేశానికి రోల్ మోడల్లా పోలీస్ స్కూల్: CM రేవంత్
TG: రేవంత్ మంచి పనులు చేయలేదు: KTR
☛ ఫిబ్రవరి GST కలెక్షన్స్ రూ.1.84లక్షల కోట్లు
☛ ఛాంపియన్స్ ట్రోఫీ: సెమీస్కు సౌతాఫ్రికా
News March 2, 2025
ఈనెల 8న కొత్త పథకాలు ప్రారంభం: మంత్రి సీతక్క

TG: ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో లక్ష మంది మహిళలతో సభ నిర్వహించనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. ఆ రోజున CM రేవంత్ కొత్త పథకాలను ప్రారంభిస్తారని తెలిపారు. RTCకి అద్దెకు ఇచ్చే మహిళా సంఘాలకు చెందిన 50 బస్సులను ప్రారంభిస్తారని, 14,236 అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు.
News March 2, 2025
వైసీపీ శ్రేణులకు పనులు, సాయం చేయొద్దు: సీఎం చంద్రబాబు

AP: వైసీపీ శ్రేణులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలాంటి పనులూ చేయొద్దని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వారికి సాయం చేస్తే పాముకు పాలు పోసినట్లేనన్నారు. ఈ విషయాన్ని పార్టీ శ్రేణులకు గట్టిగా చెబుతున్నానంటూ హెచ్చరించారు. జీడీ నెల్లూరు కార్యకర్తలతో సమావేశంలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని సూచించారు. నాయకులు తన చుట్టూ కాకుండా ప్రజల చుట్టూ తిరగాలన్నారు.