News March 1, 2025
తాడిపత్రిలో సచివాలయ సిబ్బందిపై జిల్లా కలెక్టర్ అసహనం

తాడిపత్రి పట్టణంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ శనివారం పర్యటించారు. పట్టణ పరిధిలోని కృష్ణాపురం టు సచివాలయాన్ని తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో పీ- 4 సర్వే ఎలా జరుగుతుందో పరిశీలించారు. మిస్సింగ్ సిటిజన్, చైల్డ్ వితౌట్ ఆధార్ తదితర సర్వేకు సంబంధించి ప్రజలు అందుబాటులో లేకపోవడంతో సచివాలయ సిబ్బందిపై జిల్లా కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు.
Similar News
News March 2, 2025
అనంత: చెత్త సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

తాడపత్రి మండలం ఎర్రగుంట్లలో వ్యక్తిగత ఇంకుడు గుంతకు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని కలెక్టర్ శనివారం పరిశీలించారు. ఇంటింటి నుంచి చెత్త సేకరణ, తడి, పొడి చెత్త విభజన వర్మి కంపోస్టు తయారీ విధానం గురించి వివరించారు. చెత్త నుంచి తయారైన ఎరువుల ప్యాకెట్ల రేట్లు తదితర వివరాలను కలెక్టర్ అడిగారు.
News March 1, 2025
తాడిపత్రిలో సచివాలయ సిబ్బందిపై జిల్లా కలెక్టర్ అసహనం

తాడిపత్రి పట్టణంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ శనివారం పర్యటించారు. పట్టణ పరిధిలోని కృష్ణాపురం టు సచివాలయాన్ని తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో పీ- 4 సర్వే ఎలా జరుగుతుందో పరిశీలించారు. మిస్సింగ్ సిటిజన్, చైల్డ్ వితౌట్ ఆధార్ తదితర సర్వేకు సంబంధించి ప్రజలు అందుబాటులో లేకపోవడంతో సచివాలయ సిబ్బందిపై జిల్లా కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు.
News March 1, 2025
అనంతపురం జిల్లా మహిళలకు శుభవార్త

టైలరింగ్లో మహిళలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు రూట్ సెట్ సంస్థ డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. అనంతపురం జిల్లాకు చెందిన గ్రామీణ నిరుద్యోగ మహిళలు అర్హులన్నారు. 18-45ఏళ్ల వారు ఆధార్, రేషన్ కార్డుతో అనంతపురంలోని ఆకుతోటపల్లి వద్ద ఉన్న రూట్ సెట్ సంస్థ ఆఫీసులో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. మార్చి 2లోపు పేర్లు నమోదు చేసుకోవాలని, 30 రోజుల పాటు శిక్షణ కాలంలో ఉచిత భోజన, వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు.