News March 1, 2025

చెన్నూర్: పురుగు మందు తాగి యువకుడి సూసైడ్

image

యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన చెన్నూర్ మండలంలో జరిగింది. సీఐ రవీందర్ కథనం ప్రకారం.. నాగపూర్ గ్రామానికి చెందిన గోపి డబ్బుల విషయంలో కొమ్మెర గ్రామానికి చెందిన మధుకర్‌ను కొట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన మధుకర్‌ ఇంటికి వచ్చి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి శంకరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.

Similar News

News March 3, 2025

జిల్లాలో మావోయిస్టు కదలికలు లేవు: ములుగు SP

image

ములుగు జిల్లాలో మావోయిస్టుల కదలికలు పూర్తిగా అంతరించిపోయాయని SP శబరిశ్ స్పష్టం చేశారు. ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని 25 ఏళ్ల తర్వాత ఏటూరునాగారం పోలీస్ స్టేషన్ ముందు జాతీయ రహదారికి అడ్డుగా ఉన్న గేట్లు తెరిచి వాహనాల రాకపోకలకు అనుమతి కల్పించామన్నారు. 2001లో పీపుల్స్ వార్ సభ్యులు ట్రాక్టర్లలో మందుపాతరలు అమర్చి స్టేషన్ పేల్చివేశారని, అయితే ప్రస్తుతం జిల్లాలో వారి కార్యకలాపాలు లేవన్నారు.

News March 3, 2025

ఈ రోజు నమాజ్ వేళలు

image

మార్చి 3, సోమవారం
ఫజర్: తెల్లవారుజామున 5.21 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.33 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.28 గంటలకు
అసర్: సాయంత్రం 4.45 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.23 గంటలకు
ఇష: రాత్రి 7.35 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News March 3, 2025

గంగవరం: ప్రేమ పేరుతో మోసం.. పోలీసులకు ఫిర్యాదు

image

ప్రేమ పేరుతో యువకుడు మోసం చేశాడని గంగారం మండలం జంగాలపల్లికి చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. SI రవి కుమార్ వివరాలు.. కొత్తగూడ మండలం వేలుబెల్లికి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో ఆమెతో సహజీవనం చేసి ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నట్లు సదరు మహిళ ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI వెల్లడించారు.

error: Content is protected !!