News March 22, 2024
రేపు బీజేపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల?

BJP లోక్సభ అభ్యర్థుల తుది జాబితా రేపు విడుదలయ్యే అవకాశముంది. రేపు జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో పెండింగ్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు సమాచారం. తెలంగాణలో ఖమ్మం, వరంగల్ స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. ఆరూరి రమేశ్కు WGL టికెట్ ఖరారైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఖమ్మం అభ్యర్థిపై స్పష్టత రావాల్సి ఉంది. అటు APలో పోటీ చేసే అభ్యర్థులను కూడా రేపు ఎంపిక చేస్తారని తెలుస్తోంది.
Similar News
News April 12, 2025
పాఠ్యాంశాల్లో ‘వనజీవి’ జీవిత కథ

TG: వనజీవి <<16071045>>రామయ్య<<>> అసలు పేరు దరిపల్లి రామయ్య. వృక్షో రక్షతి రక్షితః అంటూ మొక్కల పెంపకాన్ని ప్రచారం చేశారు. తన కుటుంబ సభ్యులకు చెట్ల పేర్లను పెట్టడం ప్రకృతి పట్ల ఆయన ప్రేమకు నిదర్శనం. గత ప్రభుత్వం హరితహారంలో ఆయనను బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. ఇంటికి ఎవరు వచ్చినా ఒక మొక్కను గిఫ్ట్గా ఇచ్చేవారు. ఆయన కృషిని గౌరవిస్తూ ప్రభుత్వం 6వ తరగతి పాఠ్యాంశాల్లో రామయ్య జీవితాన్ని చేర్చింది.
News April 12, 2025
ఆస్ట్రేలియాలో భారత కాన్సులేట్పై మళ్లీ దాడి

ఆస్ట్రేలియాలోని భారత కాన్సులేట్పై మళ్లీ దాడి జరిగింది. కాన్బెరాలోని రాయబార కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు గ్రాఫిటీతో జాతి విద్వేష నినాదాలను పెయింట్తో రాశారు. గతంలోనూ ఎంబసీపై ఈ దాడులు జరగడం గమనార్హం. అధికారులకు ఫిర్యాదు చేశామని భారత హైకమిషన్ తెలిపింది. దర్యాప్తు చేసి నిందితులపై చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారని వెల్లడించింది.
News April 12, 2025
గాజా ‘భూమిపై నరకం’: రెడ్ క్రాస్

గాజా ప్రస్తుత పరిస్థితి భూమిపై నరకంలా ఉందని రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ మిర్జానా స్పొల్జారిక్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘అక్కడ తాగేందుకు నీరు లేదు. కరెంట్ లేదు. ఆహారం అసలే లేదు. సాయం చేయడానికి మిగిలి ఉన్న సరుకులు కూడా మరో 2 వారాల్లో అయిపోతాయి. ఆస్పత్రులు ఎలా నడపాలో తెలియట్లేదు. అత్యవసరంగా సీజ్ ఫైర్ అమలుచేయకపోతే పరిస్థితి చేయిదాటిపోయేలా ఉంది’ అని పేర్కొన్నారు.