News March 1, 2025
ఆ స్టార్ హీరోలను కలవాలని ఉంది: మోనాలిసా

సోషల్ మీడియా పాపులారిటీతో సెన్సేషన్గా మారిన మోనాలిసా ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. హీరోయిన్లు కంగనా రనౌత్, సోనాక్షి సిన్హా నుంచి తాను స్ఫూర్తి పొందుతానని చెప్పారు. బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్, సన్ని డియోల్ను కలవాలని ఉందని తెలిపారు. ఈ జనరేషన్ నటులు వరుణ్ ధవన్, టైగర్ ష్రాఫ్ గురించి తెలియదని చెప్పారు. అవకాశం ఇస్తానని చెప్పిన సనోజ్ మిశ్రా తనను కూతురిలా చూసుకుంటారని పేర్కొన్నారు.
Similar News
News March 3, 2025
చిరంజీవి గారూ.. కూతుళ్లూ వారసులే: కిరణ్ బేడీ

‘వారసత్వం కోసం ఓ మగబిడ్డను కనమని చరణ్ను అడుగుతుంటా’ అని ఇటీవల చిరంజీవి చేసిన <<15434876>>వ్యాఖ్యలు<<>> వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మాజీ ఐపీఎస్ కిరణ్ బేడీ తాజాగా స్పందించారు. ‘చిరంజీవి గారూ.. కూతుళ్లు కూడా వారసులేనన్న విషయాన్ని నమ్మండి, గుర్తించండి. మీరు ఎలా వారిని పెంచుతారనే దానిపైనే ఇది ఆధారపడి ఉంటుంది. అమ్మాయిలను పెంచిన పేరెంట్స్ నుంచి నేర్చుకోండి. అమ్మాయిలేం తక్కువ కాదు’ అని ట్వీట్ చేశారు.
News March 3, 2025
ఇండియన్ని కాల్చిచంపిన జోర్డాన్ ఆర్మీ

జోర్డాన్ నుంచి అక్రమంగా ఇజ్రాయిల్లోకి ప్రవేశిస్తున్న భారతీయుణ్నిఅక్కడి బలగాలు కాల్చిచంపాయి. కేరళకు చెందిన థామస్ గాబ్రియల్, ఎడిసన్ అనే ఇద్దరు వ్యక్తులు అక్రమంగా సరిహద్దు దాటాలని ప్రయత్నించగా ఆర్మీ కాల్పులు జరిపింది. థామస్ అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. వీరిద్దరూ టూరిస్ట్ వీసాపై అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది.
News March 3, 2025
టైమ్ లేదు.. తక్షణమే పిల్లల్ని కనండి: TN CM

ప్రజలు తక్షణమే పిల్లల్ని కనాలని TN CM స్టాలిన్ కోరారు. రాష్ట్రం విజయవంతంగా అమలు చేసిన ఫ్యామిలీ ప్లానింగే ఇప్పుడు డిస్అడ్వాంటేజీగా మారిందన్నారు. జనాభా ఆధారిత డీలిమిటేషన్ తమిళనాడు రాజకీయ ప్రాతినిధ్యంపై ప్రభావం చూపిస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు తన మొర ఆలకించాలని కోరారు. ‘గతంలో కొంత టైమ్ తీసుకొని పిల్లల్ని కనాలని చెప్పేవాళ్లం. ఇప్పుడు పరిస్థితి మారింది. మనమిది చెప్పాల్సిందే’ అని అన్నారు.