News March 1, 2025
RR: 10వ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

ఇంటర్మీడియట్, టెన్త్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతి లేదని, పరీక్షలు జరిగే ప్రదేశాలలో జిరాక్స్ సెంటర్లను మూసివేయాలన్నారు. 185 ఇంటర్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు, ఇంటర్ మొదటి, రెండవ వార్షిక పరీక్షలకు 1,47,211 మంది, పది వార్షిక పరీక్షలకు 51,794 విద్యార్థుల పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.
Similar News
News February 28, 2026
రంగారెడ్డి: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

పోక్సో కేసులో నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ.15 వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా పాస్ట్ ట్రాక్ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి పద్మావతి తీర్పునిచ్చినట్లు ఇన్స్పెక్టర్ శంకర్ కుమార్ నాయక్ తెలిపారు. 2019లో 17ఏళ్ల బాలికను సైదాబాదాద్కు చెందిన బ్యాగరి సంతోష్ (26) ప్రేమ పేరుతో నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అతడిపై కేసు నమోదైంది.
News February 26, 2026
HYD: విద్యార్థులకు టెలి మనస్ సేవలు

TGBIE ఆధ్వర్యంలో విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక పోస్టర్ను విడుదల చేశారు. పరీక్షల్లో ఒత్తిడి, భయం, నిరుత్సాహాన్ని ఎదుర్కొనే విద్యార్థులు మౌనం వహించకుండా తమ సమస్యలను పంచుకోవాలని సూచించారు. అవసరమైనప్పుడు నిపుణుల సహాయం పొందడం తప్పు కాదని పేర్కొన్నారు. మానసిక సహాయం కోసం టెలీ మానస్ హెల్ప్లైన్ 14416లో సంప్రదించాలని BIE ఎగ్జామినేషన్ కంట్రోలర్ జయప్రదాభాయ్ వెల్లడించారు.
News February 25, 2026
సైబరాబాద్ కమిషనరేట్కు కొత్తగా 2 పోలీస్ కేనైన్లు

తెలంగాణ సీఐడీ నుంచి రెండు పోలీస్ కేనైన్లు సైబరాబాద్ కమిషనరేట్కు బదిలీ అయ్యాయి. దీంతో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న జాగిలాల సంఖ్య18కు చేరింది. పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాల గుర్తింపు, ట్రాకింగ్ వంటి కీలక విధుల్లో ఇవి సేవలందించనున్నాయి. సీఐడీ నుంచి వచ్చిన ‘రానా’ (బెల్జియన్ మాలినోయిస్), ‘రాడో’ (లాబ్రడార్) నేరాల ఛేదనలో కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు తెలిపారు.


