News March 22, 2024

ఫిర్యాదుదారుడి వివరాలు బహిర్గతం.. ఇద్దరు సస్పెండ్

image

AP: ఎన్నికల సంఘం సీ-విజిల్ యాప్‌లో ఫిర్యాదు చేసిన వ్యక్తి వివరాలు బహిర్గతం చేయడంతో ఇద్దరు అధికారులు సస్పెండ్ అయ్యారు. ఏలూరు(D) ఉంగుటూరు మండలం రామచంద్రాపురంలో లైబ్రరీ, వాటర్ ప్లాంట్‌కు పార్టీ రంగులు ఉన్నాయంటూ స్థానికుడు ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించి తెల్లరంగు వేయించారు. అయితే అతడి వివరాలు స్థానిక నాయకులకు చేరవేశారంటూ పత్రికల్లో కథనాలు రావడంతో.. కలెక్టర్ స్పందించి ఇద్దరిని సస్పెండ్ చేశారు.

Similar News

News April 12, 2025

ప్రతీకార సుంకాలపై ట్రంప్ కీలక నిర్ణయం

image

ప్రతీకార సుంకాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫోన్లు, కంప్యూటర్లు, చిప్‌లకు మినహాయింపునిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో యాపిల్, శాంసంగ్ వంటి సంస్థలకు ప్రయోజనం చేకూరనుంది. సాధారణంగా ఎలక్ట్రానిక్స్ పరికరాలు అమెరికాలో ఎక్కువగా ఉత్పత్తి అవ్వవు. వీటిని పెద్దఎత్తున దిగుమతి చేసుకుంటుంది. ఈ నిర్ణయంతో ఎలక్ట్రానిక్స్ ధరలపై అదనపు సుంకం భారం ఉండదు.

News April 12, 2025

పూరన్ విధ్వంసం.. LSG గ్రాండ్ విక్టరీ

image

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో LSG గ్రాండ్ విక్టరీ సాధించింది. 181 పరుగుల టార్గెట్‌ను 19.3 ఓవర్లలోనే ఛేదించి 6 వికెట్ల తేడాతో నెగ్గింది. ఓపెనర్ మార్క్‌రమ్ (58) హాఫ్ సెంచరీతో రాణించారు. నికోలస్ పూరన్ (1 ఫోర్, 7 సిక్సర్లతో 61 రన్స్) విధ్వంసంతో జట్టు విజయం సాధించింది. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు తీశారు. రషీద్, సుందర్ చెరో వికెట్ తీశారు.

News April 12, 2025

చందమామపై హ్యూమన్ వేస్ట్.. ఒక్క ఐడియాకు రూ.25 కోట్లు

image

అంతరిక్షంలో పేరుకుపోయిన మానవ వ్యర్థాలను తొలగించేందుకు మంచి ఐడియా ఇచ్చే వారికి నాసా బంపరాఫర్ ప్రకటించింది. వేస్ట్‌ను రీసైక్లింగ్ చేసేందుకు వినూత్న ఐడియా ఇచ్చే వారికి రూ.25 కోట్లు ($3 మిలియన్) ఇస్తామని ప్రకటించింది. 1969-72 మధ్య కాలంలో అపోలో మిషన్ ద్వారా నాసా చంద్రుడిపైకి వ్యోమగాములను పంపింది. దీంతో అక్కడ 96 బ్యాగుల వ్యర్థాలు పేరుకుపోయాయి. కాంటెస్ట్ పూర్తి వివరాలకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

error: Content is protected !!