News March 2, 2025

MDCL: ఆరెంజ్ ALERT.. ఆ రోజు జాగ్రత్త.!

image

MDCL జిల్లాలోని ఉప్పల్, మేడిపల్లి, కాప్రా, కీసర, ఘట్కేసర్, మూడు చింతలపల్లి, బాలానగర్, అల్వాల్, శామీర్పేట మండలాలకు TGDPS ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జిల్లాలో కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండడాన్ని గమనించిన TGDPS, జిల్లాలోనిపై ప్రాంతాల్లో మార్చి 3న ఎల్లుండి 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆ రోజు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

Similar News

News March 3, 2025

HYD: మహిళలపై అత్యాచారం.. వారే అధికం..!

image

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గతేడాది నమోదైన అత్యాచార కేసుల్లో అత్యధికులు స్నేహితులు ఉండగా, తర్వాత సహోద్యోగులు, సంరక్షకులు, పని వాళ్లు, డ్రైవర్లు, బంధువులు ఉన్నారు. మరోవైపు ఇరుగు పొరుగువారు, కుటుంబ సభ్యులు ఉన్నట్లుగా తేలింది. వీటి కోసం ఉమెన్ సేఫ్టీ సస్పెక్ట్ రిజిస్ట్రీ మైంటైన్ చేస్తున్నారు. దీనిద్వారా ఎప్పటికప్పుడు మహిళ యొక్క పరిస్థితి, వేధింపులను గూర్చి తెలుసుకోవడంతో పాటు నిఘా బెడుతున్నారు.

News March 3, 2025

వెయ్యి మందిని తొలగిస్తున్న ఓలా ఎలక్ట్రిక్!

image

ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ వెయ్యికి పైగా ఉద్యోగులు, కాంట్రాక్టు వర్కర్లను తొలగించేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. నష్టాలను తగ్గించుకొనేందుకే ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. దాదాపుగా అన్ని శాఖలపై ఈ ప్రభావం పడనుంది. ప్రస్తుతం కంపెనీలో 4000 ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2023, NOVలోనూ ఓలా 500 మందిని తీసేసింది. నష్టాలు, మార్కెట్ కరెక్షన్ వల్ల 60% తగ్గిన ఓలా షేర్లు ప్రస్తుతం రూ.55 వద్ద కొనసాగుతున్నాయి.

News March 3, 2025

శ్రీకాకుళం: ఇంటర్ పరీక్షలకు 337 మంది డుమ్మా

image

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో 74 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతుండగా.. సోమవారం జరిగిన తెలుగు/ సంస్కృతం పరీక్షకు 337 మంది గైర్హాజరైనట్లు జిల్లా ఆర్ఐఓ పీ.దుర్గారావు తెలిపారు. ద్వితీయ సంవత్సరం పరీక్షకు 18,782 మంది హాజరు కావాల్సి ఉండగా.. 18,445 మంది హాజరయ్యారని ఆయన తెలిపారు.

error: Content is protected !!