News March 2, 2025
బాబర్, రిజ్వాన్కు పీసీబీ ఝలక్?

పాకిస్థాన్ స్టార్ ప్లేయర్స్ బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్కు PCB ఝలక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్తో T20 సిరీస్కు వీరిద్దరిని పక్కనబెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. వీరి స్థానంలో కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 16 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది జరగబోయే T20 WC కోసం ఇప్పటినుంచే కుర్రాళ్లను ప్రోత్సహించాలని భావిస్తున్నట్లు టాక్.
Similar News
News July 6, 2025
కెప్టెన్ శుభ్మన్ గిల్ కిట్పై వివాదం?

టీమ్ ఇండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ కిట్పై వివాదం నెలకొంది. భారత జట్టుకు ప్రస్తుతం అడిడాస్ స్పాన్సరర్గా వ్యవహరిస్తోంది. కానీ నిన్న ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే సమయంలో గిల్ నైక్ టీ షర్ట్ ధరించారు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. మ్యాచ్ జరిగే సమయంలో స్పాన్సర్ కిట్ను కాదని ఇతర కిట్స్ ఉపయోగించడం ఏంటని నెటిజన్లు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
News July 6, 2025
వరల్డ్ అథ్లెటిక్స్ నిర్వహణ కోసం పోటీలో భారత్

వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ను నిర్వహించడం కోసం భారత్ బిడ్లు దాఖలు చేయనుంది. 2029, 2031 ఎడిషన్ల కోసం బిడ్లు వేయనున్నట్లు నేషనల్ ఫెడరేషన్ స్పోక్స్ పర్సన్ ఆదిల్ సుమారివాలా వెల్లడించారు. ఏదైనా ఒక ఎడిషన్ను నిర్వహించే అవకాశం కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తామన్నారు. బిడ్ల దాఖలుకు గడువు ఈ ఏడాది OCT1తో ముగియనుంది. హోస్ట్ల వివరాలను వరల్డ్ అథ్లెటిక్స్ వచ్చే ఏడాది SEPలో ప్రకటిస్తుంది.
News July 6, 2025
అకౌంట్లలోకి రూ.2వేలు.. పడేది అప్పుడేనా?

PM కిసాన్ సమ్మాన్ నిధి కింద 20వ విడత సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ నెలలోనే ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 18న నిధులు విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈనెల 20న PM మోదీ బిహార్లో పర్యటించనున్న నేపథ్యంలో దానికి 2 రోజుల ముందే PM కిసాన్ నిధులు విడుదల చేసే ఛాన్స్ ఉందని జాతీయ మీడియా పేర్కొంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ పథకం కింద ఏటా 3 విడతల్లో ₹6వేలు అందిస్తోన్న సంగతి తెలిసిందే.