News March 2, 2025
వరంగల్: అతిపెద్ద రన్ వే ఉన్న ఎయిర్పోర్ట్ మనదే!

మామునూర్ విమానాశ్రయాన్ని చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ వ్యాపారాల కోసం 1930లో నిర్మించారు. నిజాం కాలంలో దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద రన్ వే కలిగిన ఎయిర్పోర్ట్ కూడా మనదే. చైనాతో యుద్దం సమయంలోనూ మన ఎయిర్పోర్ట్ సేవలందించింది. మాజీ ప్రధాని నెహ్రూ సైతం ఓసారి ఈ ఎయిర్పోర్టులో దిగారు. మరి ఎయిర్పోర్ట్కు ఏ పేరు పెట్టాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Similar News
News November 10, 2025
APEDAలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

APEDAలో 11 బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్, అసోసియేట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BSc, MSc (అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్, ప్లాంటేషన్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫారెన్ ట్రేడ్, పబ్లిక్ పాలసీ, ఫుడ్ సైన్స్/ కెమిస్ట్రీ లేదా బయోకెమిస్ట్రీ, మైక్రో బయాలజీ), PGDM, MBAతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్సైట్: https://apeda.gov.in/
News November 10, 2025
అశువు కవిత్వంలో ఆయనకు ఆయనే సాటి

ప్రముఖ కవి, రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ(64) కన్నుమూశారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తిలో 1961 జూలై 18న జన్మించిన అందెశ్రీ అసలు పేరు ఎల్లయ్య. ఆయనకు ముగ్గురు కూతుళ్లు, ఓ కొడుకు. చిన్నతనంలో గొర్రెల కాపరిగా, కూలీగా పనిచేసిన ఆయన.. పట్టుదలతో చదివి రచయితగా ఎదిగారు. అశువు కవిత్వం చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి. తన పాటలతో తెలంగాణ పోరాటంలో కీలకపాత్ర పోషించిన ఆయన సినీ రంగానికి రచయితగా సేవలందించారు.
News November 10, 2025
రాజన్న దర్శనానికి ఇసుకవేస్తే రాలనంత జనం

కార్తీక సోమవారం సందర్భంగా దక్షిణ కాశీ వేములవాడ రాజన్న క్షేత్రం కిక్కిరిసిపోయింది. తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలిరావడంతో వేములవాడలో ఇసుక వేస్తే రాలదు అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. రాజన్న ఆలయంలో సర్వదర్శనానికి రెండు గంటలకు పైగా సమయం, భీమేశ్వరాలయంలోనూ రెండు గంటలకు పైగా నిరీక్షించాల్సి వస్తోంది.


