News March 2, 2025
పాస్పోర్టు రూల్స్ మారాయి.. ఇకపై బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరి

పాస్ పోర్టు నిబంధనల్లో కేంద్రం మార్పులు తీసుకొచ్చింది. 2023 OCT 1న లేదా ఆ తర్వాత పుట్టిన వారు తప్పనిసరిగా బర్త్ సర్టిఫికెట్ సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. జనన మరణాల ధ్రువీకరణకు రిజిస్ట్రార్, మున్సిపాల్ కార్పొరేషన్ లేదా సంబంధిత అధికారి జారీ చేసిన పత్రం సమర్పించవచ్చని పేర్కొంది. 2023 అక్టోబర్ 1కి ముందు జన్మించిన వారు DL/టీసీ/ సంబంధిత అధికారి ద్వారా జారీ అయిన పత్రాన్ని సమర్పించాలని తెలిపింది.
Similar News
News December 25, 2025
₹1.5లక్షల కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు దిశగా అడుగులు

AP: రాష్ట్రంలో ₹1.5 లక్షల కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. మారిటైమ్ బోర్డు ద్వారా 20 MOUల్లో 14 అమల్లోకి వచ్చాయని స్పెషల్ CS కృష్ణబాబు వెల్లడించారు. ‘వీటిలో ₹10వేల CR విలువైనవి 3 ఉన్నాయి. APDC ద్వారా ₹10వేల కోట్ల విలువైన 5 ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. GMR ఏరోసిటీ, మూలపేట పోర్టు, పల్నాడు, సత్యసాయి, కర్నూలు ప్రాంతాల్లో ఏరోస్పేస్ ప్రాజెక్టులు రానున్నాయి’ అని తెలిపారు.
News December 25, 2025
జైలర్ నటుడు ఆస్పత్రిపాలు

నటుడు వినాయకన్ ఆస్పత్రి పాలైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ‘ఆడు-3’ షూటింగ్లో స్టంట్లు చేస్తుండగా ఆయన గాయపడ్డారు. వెంటనే కొచ్చిలోని ఆస్పత్రికి తరలించగా MRI స్కాన్లో మెడ, భుజంలోని నరాలు, కండరాలకు డ్యామేజ్ జరిగినట్లు తేలింది. దీంతో 6 వారాల పాటు బెడ్ రెస్టు తీసుకోవాలని వైద్యులు సూచించారు. జైలర్ సినిమాతో పాపులర్ అయిన ఆయన మద్యం మత్తులో <<15212135>>పలుమార్లు<<>> రచ్చ చేసిన విషయం తెలిసిందే.
News December 25, 2025
ESIC మెడికల్ కాలేజీ& హాస్పిటల్, రాంచీలో ఉద్యోగాలు

<


