News March 2, 2025
కరీంనగర్: భద్రతా నియమాలు పాటించాలి

ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు రేపు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో లెక్కింపునకు వచ్చే కౌంటింగ్ ఏజెంట్లు, క్లరికల్ సిబ్బంది, పాత్రికేయులు భద్రతా నియమాలు పాటించాలని ట్రాఫిక్ ఏసిపి యాదగిరిస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. అంబేద్కర్ స్టేడియం గేట్ నంబర్-1 ద్వారా మాత్రమే లోపలికి ప్రవేశించి నిర్దేశించబడిన ప్రదేశంలో వాహనాలను పార్కింగ్ చేసుకుని, గేట్ నంబర్ -4 ద్వారా ఇండోర్ స్టేడియంలోకి అనుమతించనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News November 12, 2025
కిడ్నీలు దొంగిలించే ముఠాలో ప్రధానమైనవారు వీరే.!

కిడ్నీలు దొంగిలించే రాకెట్లో కీలకపాత్ర పోషిస్తున్న పెళ్లి పద్మ – కాకర్ల సత్య, వెంకటేశ్వర్ల కేసును పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మదనపల్లె గ్లోబల్ ఆస్పత్రి కేంద్రంగా కిడ్నీ రాకెట్ వ్యవహారం ఏడాది కాలంగా సాగుతున్నట్లు సమాచారం. బాంబేకి చెందిన ఓ మహిళా డాక్టర్ మదనపల్లె జిల్లా ఆస్పత్రి డయాలసిస్కు మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తోందని తెలిసింది.
News November 12, 2025
ఇంద్రకీలాద్రిపై రూ.500 టికెట్లు రద్దు

కార్తీకమాసం ముగింపు నేపథ్యంలో, విజయవాడ ఇంద్రకీలాద్రిపై రూ.500 ప్రత్యేక దర్శనం టిక్కెట్ల విక్రయాన్ని అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, ఈ నెల 14, 15, 16 తేదీలలో ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఈ టిక్కెట్ల విక్రయం నిలిపివేయబడుతుందని తెలిపారు.
News November 12, 2025
ఒకే వేదికపైకి రష్మిక, విజయ్..! అధికారికంగా ప్రకటిస్తారా?

ప్రేమ, త్వరలో పెళ్లి వార్తల వేళ హీరోయిన్ రష్మిక మందన్న, హీరో విజయ్ దేవరకొండ ఇవాళ ఒకే వేదికపై కనిపించనున్నట్లు తెలుస్తోంది. రష్మిక నటించిన ‘ది గర్ల్ఫ్రెండ్’ మూవీ సక్సెస్ మీట్ హైదరాబాద్లో జరగనుంది. దీనికి విజయ్ చీఫ్ గెస్ట్గా వస్తారని సమాచారం. ఈ వేదికగా తమ పెళ్లి గురించి అధికారికంగా ప్రకటిస్తారేమోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


