News March 2, 2025
సత్యవేడులో కేజీ చికెన్ ధర రూ.90

సత్యవేడు పట్టణంలో కేజీ చికెన్ 90 రూపాయలకు అమ్ముతున్నారు. లైవ్ చికెన్ 70 రూపాయలకే ఇస్తామని నిర్వాహకులు కోళ్ల చిన్న తెలిపారు. దీంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు చికెన్ కొనడానికి ఎగబడుతున్నారు. బుధవారం కేజీ చికెన్ ధరను 120-100 రూపాయలకు అమ్మారు. వరదయ్యపాలెం మండలంలో కేజీ చికెన్ ధర రూ.180 పలుకుతుంది.
Similar News
News November 5, 2025
HYD: 3 నెలలైనా ఎందుకు పట్టించుకోవడం లేదు: సీఎం

బీఆర్ఎస్ సహకరించకపోతే మోదీ ప్రధాని అయ్యేవారు కాదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ పేరుతో జూబ్లీహిల్స్లో ఓట్లు అడుగుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ కోరితే KCRకు 24 గంటల్లో చిప్పకూడు తినిపిస్తానన్న MP కిషన్ రెడ్డి, విచారణకు ఆదేశించి 3 నెలలైనా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ 30 వేల మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.
News November 5, 2025
మెదక్లో రేపటి నుంచి 11వ జోనల్ స్పోర్ట్స్ మీట్

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ సొసైటీ ఆధ్వర్యంలో 2025 జోన్-III(బాలికలు) 11వ జోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్ నిర్వహించబడుతుంది. ఈ క్రీడాపోటీలు ఈ నెల 6 నుండి 8 వరకు జరుగుతాయని ప్రిన్సిపల్ పద్మావతి తెలిపారు. మెదక్ పట్టణంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ పాఠశాల(ఇందిరా గాంధీ స్టేడియం దగ్గర) వేదికగా ఈ స్పోర్ట్స్ మీట్ను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
News November 5, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> జిల్లా వ్యాప్తంగా ఘనంగా కార్తిక పౌర్ణమి వేడుకలు
> జనగామ, సిద్దిపేట హైవేపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి రాస్తారోకో
> చీటకోడూరు బ్రిడ్జి వద్ద బీజేపీ నేతల నిరసన
> జిల్లా వ్యాప్తంగా నల్ల నరసింహులు వర్ధంతి
> పాలకుర్తిలో వెలిగిన అఖండ జ్యోతి
> గాడిదలు, దున్నపోతులతో నిరసన తెలుపుతాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
> జనగామ: బిక్షాటనతో ఎస్ఎఫ్ఐ నేతల నిరసన
> బ్రిడ్జి పనులకు ఎమ్మెల్యే యశస్విని


