News March 2, 2025
కొత్తగూడెం ఎయిర్పోర్ట్పై కనిపించని పురోగతి

కొత్తగూడెం జిల్లాలో ఎయిర్పోర్టుపై ఉమ్మడి ఖమ్మం ప్రజల ఆశలు అడియాసలవుతున్నాయి. ఇటీవల ఎయిర్పోర్టు ఏర్పాటుపై ఫీజిబిలిటీ సర్వే పూర్తయిన విషయం తెలిసిందే. అయితే ప్రధాని మోదీ వరంగల్లో ఎయిర్పోర్టు అభివృద్ధికి అనుమతులు మంజూరు చేయగా వేగం పుంజుకుంది. కానీ కొత్తగూడెంలో మాత్రం ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఈ విషయంపై జిల్లా మంత్రులు, రాష్ట్రంలోని కేంద్రమంత్రులు దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News March 3, 2025
ఖమ్మం కలెక్టరేట్లో దివ్యాంగులకు ఉచిత భోజనం: కలెక్టర్

ఖమ్మం జిల్లా కలెక్టరేట్కు వివిధ పనుల నిమిత్తం వచ్చే దివ్యాంగులకు ఉచిత భోజన సదుపాయాన్ని ఈనెల 5 నుంచి కల్పించనున్నట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దివ్యాంగులు తమ సమస్యల పరిష్కారం, వివిధ పనుల కోసం సుదూర ప్రాంతాల నుంచి కలెక్టరేట్కు వస్తున్నారనే అంశం తన దృష్టికి వచ్చిందని చెప్పారు. దీంతో కలెక్టరేట్ క్యాంటీన్లో మధ్యాహ్నం ఉచిత భోజన వసతి కల్పించాలని నిర్ణయించామన్నారు.
News March 3, 2025
ఖమ్మం: MLC ఎన్నికలు.. మొదటి రౌండ్ ఫలితాలు

WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు ఫలితాలను అధికారులు వెల్లడించారు.
1) PRTU అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి – 6,035
2) UTF అభ్యర్థి నర్సిరెడ్డి – 4,820
3) స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి- 4,437
4) స్వతంత్ర అభ్యర్థి పూల రవీందర్- 3,115
5) BJP మద్దతు అభ్యర్థి సరోత్తంరెడ్డి- 2,289
కాగా మొత్తం 19 మంది అభ్యర్థులకు చెల్లిన ఓట్లు 23,641, చెల్లని ఓట్లు 494
News March 3, 2025
మార్చిలోనే సూర్రు మనిపిస్తున్న సూర్యుడు

మార్చి మొదటి వారంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భానుడు భగభగమంటున్నాడు. నిన్న అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాచలంలో 38.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. వరసగా మూడు రోజుల పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పింది. ఎండల ప్రభావం ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా ఉండనుంది. సింగరేణి ప్రాంతం కనుక మిగతా జిల్లాలో కంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.