News March 2, 2025
MBNR: సీఎం రాకతో భారీ బందోబస్తు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జోగులాంబ జోన్-7 ఎల్ ఎస్ చౌహన్ ఏర్పాట్లను పరిశీలించారు. నలుగురు SPలు, మరో నలుగురు అడిషనల్ SPలు, CIలు-21, SIలు-28, ASIలు-140, హెడ్ కానిస్టేబుళ్లు,కానిస్టేబుళ్లు, హోంగార్డులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాటు చేశారు.
Similar News
News October 16, 2025
మక్తల్: దొంగల దాడి.. ఇంటి యజమానికి గాయాలు

మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్తగార్లపల్లిలో గురువారం అర్ధరాత్రి దొంగలు ఇంట్లోకి చొరబడి మహిళ మెడలోని పుస్తెలతాడు లాక్కోవడానికి యత్నించారు. అడ్డుకున్న ఇంటి యజమాని అంజిలప్పను రాడ్తో దెబ్బకొట్టి గాయపరిచారు. ఆ మహిళ అరుపులు కేకలు వేయడంతో గ్రామస్థులు పరుగున చేరుకునే లోపు ముగ్గురిలో ఇద్దరు దొంగలు పరారయ్యారు. ఒక దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News October 16, 2025
మధ్యాహ్నం కేబినెట్ భేటీ.. సురేఖ వస్తారా..?

తెలంగాణ కాంగ్రెస్లో కొండా దంపతుల వ్యవహారం మరింత ముదిరింది. పొంగులేటిపై టెండర్ల విషయంలో కామెంట్లు సహా, రెడ్లంతా తమ ఫ్యామిలీపై కుట్ర చేస్తున్నారని ఆమె కూతురు ఆరోపణలు చేయడం తెలిసిందే. ఇవాళ మధ్యాహ్నం కేబినెట్ భేటీ ఉండగా ఆమె వస్తారా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. అటు సురేఖ రాజీనామా చేస్తారని కొందరు, ఆమెను తప్పిస్తారని మరికొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది.
News October 16, 2025
కొండా దంపతుల భవిష్యత్ కార్యాచరణ ఏంటి?

మంత్రి పొంగులేటితో మొదలైన లొల్లి సుమంత్ విషయం వరకు వెళ్లి సీఎంను కూడా తాకింది. తమపై రెడ్లు కుట్ర చేస్తున్నారంటూ సుష్మిత ఆరోపించగా.. సుమంత్ విషయం తనకేమీ తెలియదని మురళి తెలిపారు. హన్మకొండలోని సురేఖ ఇంటివద్ద పోలీస్ అవుట్ పోస్టునూ తొలగించారు. మరోవైపు ఇవాళ కార్యకర్తలతో కొండా దంపతుల భేటీ ఉండగా.. మురళి మాత్రమే హాజరవుతారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది.