News March 2, 2025

వేసవి అలర్ట్.. విద్యార్థులు జాగ్రత్త

image

వేసవి మెుదలవటంతో పరీక్షలు రాసే విద్యార్థులు వడదెబ్బ తాకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు 7-8గంటలు నిద్రపోవాలని, కొబ్బరినీళ్లు, ఉప్పు కలిపిన మజ్జిగ, నిమ్మరసం లాంటివి తీసుకోవాలని చెబుతున్నారు. పరీక్ష గదిలోకి వాటర్‌బాటిల్ తీసుకెళ్లాలని, ఎండలో వెళ్లేటప్పుడు గొడుగు లేదా క్యాప్ తప్పనిసరిగా వాడాలని అంటున్నారు. తేలికపాటి లేత రంగు దుస్తులు ధరించటం ఉత్తమమని సూచిస్తున్నారు.

Similar News

News October 24, 2025

నింగిలోకి ఎగిరిన తొలి స్వదేశీ ట్రైనర్ ఫ్లైట్

image

స్వదేశీ సాంకేతికతతో డెవలప్ చేసిన భారత తొలి ట్రైనర్ ఫ్లైట్ నింగిలోకి ఎగిరింది. బెంగళూరులో తయారు చేసిన హిందుస్థాన్ టర్బో ట్రైనర్-40(HTT-40) అందుబాటులోకి వచ్చినట్లు HAL వెల్లడించింది. దీని ద్వారా నెక్స్ట్ జనరేషన్ ఎయిర్ వారియర్స్ శిక్షణ పొందుతారంది. ముందు ఒకరు, వెనుక మరొకరు కూర్చునేలా డిజైన్ చేసింది. బేసిక్ ఫ్లైట్ ట్రైనింగ్‌, వైమానిక విన్యాసాలు, నైట్ ఫ్లైయింగ్‌లో ట్రైనింగ్ ఇచ్చేందుకు ఉపయోగపడనుంది.

News October 24, 2025

అడవులను కబ్జా చేస్తే ఎవరినీ ఉపేక్షించం: పవన్

image

AP: అడవుల ఆక్రమణలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని Dy.CM పవన్ హెచ్చరించారు. రాష్ట్ర స్థాయి అటవీ అధికారుల వర్క్ షాప్‌లో మాట్లాడారు. ‘శేషాచలం అడవుల్లో ఎర్రచందనం విత్తనాలు చల్లించేందుకు ప్లాన్ చేస్తున్నాం. ఎకో టూరిజం ప్రోత్సాహంతో గిరిజన యువతకు ఉపాధి కల్పిస్తాం. అటవీ శాఖ సిబ్బంది భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తాం. రాష్ట్రంలో గ్రేట్ గ్రీన్ వాల్ నిర్మాణానికి కృషి చేద్దాం’ అని పిలుపునిచ్చారు.

News October 24, 2025

దూసుకొస్తున్న తుఫాన్.. అత్యంత భారీ వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపటికి వాయుగుండంగా మారుతుందని APSDMA తెలిపింది. ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని పేర్కొంది. ఇది సోమవారం ఉదయానికి నైరుతి, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందంది. దీంతో రాయలసీమ, కోస్తాంధ్రలో శనివారం భారీ, ఆదివారం అతిభారీ, సోమవారం అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించింది.