News March 2, 2025
మరికల్: లారీ ఢీకొని మహిళ మృతి

మరికల్ మండల కేంద్రంలో లారీ ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. మండల కేంద్రంలో నివాసం ఉంటున్న అనూష(40)ను ఆదివారం ఉదయం ప్రమాదవశాత్తు లారీ ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఉదయం 11 గంటలకు మృతి చెందినట్లు మరికల్ ఏఎస్ఐ ఎల్లయ్య తెలిపారు.
Similar News
News July 4, 2025
కరీంనగర్: బయట ఫుడ్ తింటున్నారా..? బీ కేర్ ఫుల్

KNR, జ్యోతినగర్లోని రాజుగారి బిర్యానీ అడ్డా రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అంకిత్ రెడ్డి ఈరోజు తనిఖీ చేశారు. ఒక ఫిర్యాదు ఆధారంగా తనిఖీలు జరిగాయి. కిచెన్, ఫ్రీజర్లో ముందురోజు మిగిలిపోయిన 17KGల వండిన చికెన్, కార్న్, ఇతర కూరగాయలు, వస్తువులను గుర్తించి ధ్వంసంచేశారు. చికెన్ ఐటమ్స్లో కృత్రిమరంగులు వాడినందుకు నోటీసులు జారీచేశారు. మాంసాహార ముడిపదార్థాలపై తప్పనిసరిగా తేదీ, లేబుల్ వేయాలని ఆదేశించారు.
News July 4, 2025
హైకోర్ట్ అసోసియేషన్ అధ్యక్షుడికి వేములవాడ రాజన్న ప్రసాదం

హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షుడు అనుముల జగన్ను వేములవాడ బార్ అసోసియేషన్ సభ్యులు శుక్రవారం హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శ్రీ రాజరాజేశ్వర స్వామి లడ్డు ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుండా రవి, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు జనార్ధన్ ,బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
News July 4, 2025
విశాఖలో ఏడో తరగతి బాలికపై అత్యాచార యత్నం

రణస్థలం ప్రాంతానికి చెందిన పిన్నింటి చంద్రశేఖర్ (26) డెలివరీ బాయ్గా పనిచేస్తూ రేసపువానిపాలెం వినాయకనగర్ వద్ద నివాసం ఉంటున్నాడు. తన ఇంటి కింద నివసిస్తున్న ఏడో తరగతి చదువుతున్న బాలికను గదికి రప్పించి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ట్రీ టౌన్ పోలీసులు నిందితుడిని రిమాండ్కి తరలించారు.