News March 22, 2024

మాజీ మంత్రుల సీట్లు గల్లంతేనా..?

image

AP: టీడీపీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు కొందరికి దాదాపుగా సీట్లు లేనట్లే కనిపిస్తోంది. కళా వెంకట్రావు, దేవినేని ఉమ, సత్యనారాయణ, జవహర్‌కు మూడో జాబితాలోనూ చోటు దక్కలేదు. ఇటు చీపురుపల్లిలో గంటా శ్రీనివాసరావు పోటీపై సందిగ్ధం నెలకొంది. దీంతో అక్కడి సీనియర్ నాయకురాలు కిమిడి మృణాళిని సీటు పైనా క్లారిటీ రాలేదు. మరోవైపు సీనియర్లు సోమిరెడ్డి, కోళ్ల లలిత, వనమాడి వెంకటేశ్వర్లు టికెట్లు కన్ఫార్మ్ చేసుకున్నారు.

Similar News

News April 10, 2025

లండన్‌లో ఆ హీరోహీరోయిన్ల కాంస్య విగ్రహాలు

image

భారత సినీ చరిత్రలో ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. విడుదలై 30 ఏళ్లు గడచిన సందర్భంగా ఆ మూవీకి లండన్‌లో అరుదైన గౌరవం దక్కనుంది. అక్కడి లైసెస్టర్ స్క్వేర్‌లో DDLJ హీరోహీరోయిన్లు షారుఖ్, కాజోల్‌ కాంస్య విగ్రహాల్ని నెలకొల్పనున్నారు. ఈ ఘనత దక్కించుకున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. ఈ ఏడాది చివరిలోపు విగ్రహాల్ని ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది.

News April 10, 2025

అమెరికా వెళ్లే చైనీయులకు బీజింగ్ హెచ్చరికలు

image

అమెరికాలో ప్రయాణిస్తున్న, ప్రయాణించనున్న తమ దేశస్థులకు చైనా హెచ్చరికల్ని జారీ చేసింది. ‘అమెరికా-చైనా బంధం బలహీనపడటం, అమెరికా దేశీయ భద్రత పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని USకి ప్రయాణించేవారు అప్రమత్తంగా ఉండాలి’ అని స్పష్టం చేసింది. అమెరికా, చైనా ప్రస్తుతం తీవ్రస్థాయి సుంకాల యుద్ధంలో ఉన్న సంగతి తెలిసిందే. చైనాపై మొత్తం సుంకాల్ని ట్రంప్ ఈరోజు 125శాతానికి పెంచారు.

News April 10, 2025

ALERT: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా..?

image

బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకునేవారికి నిబంధనల్ని మరింత కఠినం చేయాలని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. ఎంత రుణం జారీ చేయాలన్నదాని నుంచి తీసుకున్న నగదును ఎలా వినియోగించాలి, రుణం తీర్చని బంగారాన్ని సంస్థలు ఎలా వేలం వేయాలి అన్న అంశాల వరకు అనేక అంశాలపై RBI విధివిధానాల్ని నిర్ణయించే అవకాశం ఉంది. ఈ ప్రకటన అనంతరం ముత్తూట్, IIFL, మణప్పురం, చోళమండలం సంస్థల షేర్లు పతనమయ్యాయి.

error: Content is protected !!